పాలమూరు, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో మహబూబ్నగర్లోని లిటిల్ స్కాలర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆరుగురు విద్యార్థులు 10జీపీఏ సాధించగా నలుగురు 9.8 జీపీఏ, 26మంది 9.7నుంచి 9.0 వరకు.. విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం అభినందించింది. పాఠశాల వ్య వస్థాపకుడు శ్రీ జలజం సత్యనారాయణ ఆలోచనలకు అనుగుణంగా మున్ముందు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తామని యాజమాన్యం స్పష్టం చేశారు.