దేవరకద్ర, డిసెంబర్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోడ్రైవర్ల జీవనం అయోమయంలో పడిందని ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు కుర్వ రాము అన్నారు. సోమవారం దేవరకద్రలోని ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం మహిలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ మా కడుపుకాలే చర్యలు తీసుకున్నదన్నారు. దేవరకద్ర మండలంలో దాదాపు 200 కుటుంబాలు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాయని, వారందరికీ నేడు ఆదాయం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి నెలకు రూ.15వేలు సాయం అందించి ఆదుకోవాలన్నారు.