ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, జనవరి 20 : ఆరోగ్య అచ్చంపేటగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని ఏడోవార్డు ఇంద్రనగర్లో శుక్రవారం బస్తీ దవాఖానను ప్రారంభించారు. దవాఖానలో వసతులు, మందులు, వైద్యసేవల వివరాలను డీఎంహెచ్వో సుధాకర్లాల్తో తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ ప్రజలకు వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అచ్చంపేట ప్రాంతంలో వైద్యసేవలను విస్తృతపర్చేందుకుగానూ నియోజకవర్గానికి 49 పల్లె దవాఖానలను మంజూరు చేయించగా, ఇందులో 42 దవాఖానలకు భవనాలు మంజూరైనట్లు చెప్పా రు. అచ్చంపేట మున్సిపాలిటీలో మరో మూడు బస్తీ దవాఖానల భవన నిర్మాణాలకు స్థలం కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్కు సూచించారు. ఒక్కో బస్తీ దవాఖాన భవన నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున మంజూరైనట్లు తెలిపారు.
చిన్నపాటి ఆరోగ్య సమస్యను చూయించుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా బస్తీ, పల్లె దవాఖానల్లో వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. ఉప్పునుంతలలో నిర్మిస్తున్న 30 పడకల దవాఖానను రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జి ల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మాజీ చైర్మన్ తులసీరాం, కమిషనర్ బాల్రాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బలుస అరుణ, కౌన్సిలర్లు మన్నుపటేల్, గడ్డం రమేశ్, అంత టి శివ, గౌరీశంకర్, నూరిబేగం, లావణ్యావెంకటేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో తారాసింగ్, డాక్టర్ శివ, అశోక్ప్రసాద్, రాజేశ్, మహముదాబేగం తదితరులు పాల్గొన్నారు.