మహబూబ్నగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆస్తుల బదాలాయింపును సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దేశంలో ఏ రా ష్ట్రంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పా రదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ పోర్టల్ను రూపొందించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ‘ధరణి’కి రైతుల నుంచి ఊహించని వి ధంగా ఆదరణ లభిస్తున్నది. ఈ పోర్టల్ను ప్రా రంభించి రెండేండ్లు పూర్తయింది. ఉమ్మడి జి ల్లాలో ఇప్పటివరకు దాదాపు 3 లక్షల రిజిస్ట్రేష న్లు జరిగాయి. ప్రభుత్వానికి సుమారు రూ. 150 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అం తేకాకుండా వ్యవసాయ భూములకు సంబంధించిన సమాచారం అంతా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ వెబ్సైట్పై ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ధరణి వచ్చిన తరువాత భూముల లావాదేవీలు సులభంగా జరుగుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్-బీలకు సంబంధించిన కైంప్లెంట్లను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతి లావాదేవీని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తాసిల్దార్లకు సూచనలు అందిస్తున్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తూ.. దళారులను నమ్ముకొని రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చేసేవారు. నేడు ధరణితో ఈ వ్యవస్థకు చెక్పడింది. రూపాయి కూడా ఖర్చు లేకుండా నిమిషాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. వెంటనే మ్యుటేషన్, ఈ పాస్బుక్ను జనరేట్ చేసి ఇస్తున్నారు.
అరచేతిలో ధరణిఅరచేతిలో ధరణిఅరచేతిలో ధరణిగ్రామాల్లో వ్యవసాయ భూముల వివరాలు, నక్షాలు అన్నీ ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామం వివరాలు ఎంటర్ చేస్తే చాలు.. సదరు భూములకు సంబంధించిన సమాచారం అంతా కనిపిస్తుంది. గతంలో పొలాలను అమ్మినా. అవి బదిలీ కాకపోవడంతో చాలాచోట్ల గొడవలు జరిగేవి. కానీ నేడు ధరణి ద్వారా గ్రామాల్లో చాలా వరకు భూముల పంచాయితీలు తగ్గాయి. అత్యంత భద్రతతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, బదలాయింపు చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో రిజిస్ట్రేషన్లో ఉన్న లోసుగులన్నింటినీ తొలగించడంతో సులభతరంగా రిజిస్ట్రేషన్కు వీలుపడింది.
నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి..
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. రైతులు ముందుగానే భూముల సర్వేనెంబర్ వివరాలు తెలుపుతూ ఆధార్ కార్డు నంబర్తో రిజిస్ట్రేషన్ కోసం మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. రిజిస్ట్రేషన్ డబ్బును ముందుగానే చాలన్ కట్టాలి. ఆ తరువాత క్రయ, విక్రయదారులు ఎంచుకున్న తే దీన సాక్షులతో కలిసి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. ఆయా కార్యాలయాల్లో ఏ రో జుకారోజు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. క్ర య, విక్రయదారులు, సాక్షులతో ఆన్లైన్ లో ఫొటోలు, సంతకాలు తీసుకుంటారు. సీసీఎల్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా, ఆధార్కార్డు వివరాలు తీసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం నిమిషాల్లో నే పూర్తి చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వచ్చి గంటల్లోనే ఇంటికి చేరుకుంటున్నా రు. అంతేకాకుండా వెంటనే పాస్బుక్, మ్యుటేషన్ కూడా జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో చేపడుతున్నా రు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా భూములు బదలాయింపు అవుతున్నది. అయితే, ఉమ్మడి జిల్లాలో ‘ధరణి’ని క లెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్ర తి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు క్లి యర్ చేస్తున్నారు. అంతేకాకుండా భూముల వివరా లు, పాస్బుక్ల జారీలో తప్పులను సవరించేందుకు కూడా అనేక మా డ్యుల్ను ప్రవేశపెట్టారు. రైతులు భూములకు సంబంధించిన కైంప్లెంట్ను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదుల ను ఒకే ప్లాట్ఫామ్ లో పరిష్కరించేందుకు ప్రత్యేక మా డ్యుల్ ఉన్నది. 33 రకాల లావాదేవీ లు, 10 రకాల మాడ్యుల్స్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.