మహబూబ్నగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విషయంలో అబద్దపు లెక్క లు చె ప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ము క్కు నేలకు రాస్తారా అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర శ్నించారు. మహబూబ్నగర్ జి ల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.తెలంగాణకు రూ.2.52 లక్షల కో ట్లు ఇచ్చామని, మాతో రాష్ట్ర ప్రభుత్వం బాగుండింటే ఇంకా ఎక్కువ ఇచ్చే వాళ్లమని అమిత్షా అంటున్నార ని ధ్వజమెత్తారు. ఈ ఎనిమిదేండ్లల్లో రూ. 3.68 లక్షల కోట్లు తాము కేంద్రానికి చెల్లించామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన దానిలో రూ.1.68 లక్ష ల కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. తామే కేంద్రానికి, వెనుకబడిన రాష్ర్టాలకు తమ చెమట, రక్తం ధారబోసిన కష్టం నుంచి రూ.2 లక్షల కోట్లు ఇచ్చామని, వాళ్లిచ్చింది ఏమీ లేదన్నారు. తాను చెప్పింది తప్పయితే తన మం త్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. అమిత్ షా చె ప్పిందే తప్పయితే… తప్పని నిజాయితీగా ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తారా.. అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు మేమేమీ చేయలేదని, పచ్చి దగాకోర్లమని అమిత్షా ఒప్పుకొని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు ముందు పాలమూరులో కేవలం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయకట్టు ఉండగా.. ఇప్పు డు కొత్తగా 8 లక్షల ఎకరాల ఆయకట్టును సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. పాలమూరు-రం గారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే కొందరు సైంధవ పాత్ర పోషించి కోర్టుల్లో కే సులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇదే వేదికపై 2014లో ఎన్నికల సమావేశంలో తనను తిరిగి ప్రధానిని చేస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, 90 శాతం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అంతకుముందు బీజేపీ నేత సుష్మాస్వరాజ్ సై తం ఇదే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఎ నిమిదేండ్లయినా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో తుంగభద్రపై ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టుకు మాత్రంఇవ్వడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రలో కృష్ణానది నీటి వాటాగా ఉన్న 811 టీఎంసీల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కనీసం 575 టీఎంసీలు ఇవ్వమని కేంద్రాన్ని అడుగుతున్నా స్పందించడం లేదన్నారు. పాదయాత్రల పేరిట అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వికారాబాద్- నారాయణపే ట- కృష్ణా, గద్వాల- మాచర్ల రైల్వే లైన్ ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా కేంద్రం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చే స్తోందన్నారు. తెలంగాణలోని పథకాలన్నీ తమ పైసలం టూ బీజేపీ నాయకులు లేని డాంబికాలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని మసీదులన్నింటినీ తవ్వుదామని అందులో శివం వస్తే వారిదని, శవం వస్తే మీదని అంటున్నారని విమర్శించారు. దమ్ముంటే దేవరకద్రలోని బీడు భూ ములు తవ్వి నీటిని పారిద్దామన్నారు. పునాదులు తవ్వి ఇండ్లు నిర్మిద్దామని హితవు పలికారు.
సిద్దాయపల్లి ఇండ్లు చూస్తే పల్లెటూళ్లలో కూడా అపార్ట్మెంట్లు కట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. లంచం అడిగారా అని లబ్ధిదారులను ప్రశ్నించానని.., ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చె ప్పినట్లు వివరించారు. తమ చేతుల మీదుగానే ఇండ్ల లక్కీ డిప్ తీయించారని సంతోషంగా చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. సొంత స్థలాలు ఉన్న వారికి ఇండ్లు ని ర్మించుకునేందుకు రాష్ట్రంలో 3 వేల మందికి రూ.3 ల క్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. చంటి బిడ్డను చూసుకున్న తీరుగా దేవరకద్ర నియోజకవర్గాన్ని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తీర్చిదిద్దారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపైనే దృష్టి సారించారన్నారు. హెలిక్యాప్టర్ ద్వారా నియోజకవర్గానికి వస్తూ కందూరు పెద్ద వాగుపై చూశామని.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లుగా 3 చెక్డ్యాంలు కనిపించాయన్నారు. సిరిసిల్లలో 12 చెక్డ్యాంలు కడితే దేవరకద్రలో 21 నిర్మించాడన్నారు. నియోజకవర్గానికి డిగ్రీ, జూనియర్ కళాశాలలు, రెండు 100 పడకల దవాఖానాలు ఇస్తామన్నారు. కొత్తకోటకు రూ.4 కోట్లు, భూత్పూరులో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. దేవరకద్రను మున్సిపాలిటీ చేస్తామన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలోని ఏ సమస్య అయి నా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్తే పరిష్కారం కావడం దేవరకద్ర ప్రజల అదృష్టమని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. స్వరాష్ర్టానికి ముం దు.. తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని జనం గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎ న్నికలు ఎప్పుడైనా రానీ కేటీఆర్కు ఉమ్మడి జిల్లా తరఫున 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లతో ఘన విజ యం సాధిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఎనిమిదేండ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. డీకే అరుణ, చిన్నారెడ్డి మంత్రులుగా ఉండి కూడా చేయలేనిది.. మంగనూరు నుంచి చిన్న కాలువ ద్వారా 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఇదంతా కేసీఆర్తోనే సాధ్యమైంద న్నారు. ఒక్కరోజే రూ.119కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
70 ఏండ్లుగా పరిపాలించిన వారు ఇప్పుడు పార్టీలు మారి రాజకీయాలు చేస్తున్నారని, పాలమూరులో ఒకప్పుడు బాగా బతికిన వాళ్లను వలస కార్మికులుగా మార్చేశారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. పాలమూరు లేబర్ అనే బిరుదు వచ్చేలా చేసిన ఘనత గత పాలకులకే దక్కిందన్నారు. తెలంగాణ వస్తే బాగుపడతామని.. జోగుళాంబ నుంచి పోరాటం చేసిన ఘనత కేసీఆర్కే సొంతమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. కేసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు.. ఉద్యమం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోసం చేశారన్నారు. ఓ జాతీయ పార్టీ నాయకుడు పిట్టలదొర తీరును వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. తెలంగాణ బాగు పడుతుంటే ఓర్వలేక పోతున్నారని, వ్యవసాయం గురించి తెలియని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.
సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై పార్లమెంటులో బీజేపీ నేతలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో పొగిడారని.. కానీ రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు మాత్రం కుక్కలు మొరిగినట్లు మొరుగుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. యువనేత కేటీఆర్ ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తుంటే పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖలో ఏడేండ్లలో 17వేల పైచిలుకు కొత్త పరిశ్రమలు రూ.2.40లక్షల కోట్ల పెట్టుబడులు, 16లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ మొదటి కార్యాలయం అమెరికాలో ఉంటే రెండో కార్యాలయాలు హైదరాబాద్లో స్థాపించేలా చేసిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు. హైదరాబాద్లో రూ.10వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇటీవలే కెనడా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎంతగానో పొగిడారని, అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారన్నారు. లవంగం, బుడ్డర్ఖాన్లు ఇంతటి అభివృద్ధి చేయగలరా.. అని వేముల ప్రశ్నించారు.
దేవరకద్ర నియోజకవర్గంలో రూ.55 కోట్లతో పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు మం త్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో వర్నె- ముత్యాలంపల్లి మధ్య హైలెవల్ బ్రిడ్జి, రూ.1.20 కోట్లతో గుడిబండ రోడ్డు, రూ.3.50 కోట్లతో భూత్పూరులో మి నీ స్టేడియం, రూ.10కోట్లతో భూత్పూరు మున్సిపాలిటీలో బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ.2 కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి, రూ. 12 కోట్లతో భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అమిస్తాపూర్లో రూ.17కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లకు గృహప్రవేశాలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, వాణీదేవి, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్ ఇసాక్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, వాల్యానాయక్, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, సరిత, లోకనాథ్రెడ్డి, మాజీ ఎంపీ జగన్నాథం, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపీపీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.