జడ్చర్ల, మే 31 : ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 8న జడ్చర్ల పట్టణానికి రానున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని ఎర్రగుట్టలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
అర్హులైన పేదలకు 8న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇండ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.