మల్దకల్, డిసెంబర్ 9 : ఆదిశిలా క్షేత్రంలో వెలసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా కోటి దీపోత్సవం వైభవంగా కొనసాగుతున్నది. శనివారం గ్రామంలోని మహిళలు, చిన్నారులు తెల్లవారు జామున ఆలయం చుట్ట్టూ దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూ జలు చేశారు. అలాగే రాత్రి వేళ మహిళలు కార్తీ క దీపాలు వెలిగించారు.
భక్తుల రద్దీ
స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల యం కార్తీక శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు స్వా మి వారికి బిందెసేవా, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సద్దలోనిపల్లి శ్రీకృష్ణస్వా మి ఆలయం, పాల్వాయి అడవి ఆంజనేయ స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.
శ్రీవారికి విశేష పూజలు
అయిజ, డిసెంబర్ 9 : మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి శనివారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సం దర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంక టేశ్వరస్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి జయంతిని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామికి పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. అలాగే పట్టణ సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థ ప్రసా దా లు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు పాల్గొన్నారు.
విజయరాయుడి ఆలయంలో..
అయిజ రూరల్, డిసెంబర్ 9: మండలంలోని సంకాపురం గ్రామ శివారులో వెలసిన విజయరాయుడికి కార్తీక ద్వాదశిని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి అర్చకుడు గణేశ్చారి నదీ జలంతో అభిషేకించి అర్చన, ఆకుపూజ చేశారు.