కోస్గి, డిసెంబర్ 12 : అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. సోమవారం గుండుమాల్ మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, నాయకుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.