నాగర్కర్నూల్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయేతర పనిముట్లతో ఉన్నవాటినే పరిశ్రమలుగా భావిస్తున్నామని, అన్నింటికీ మించిన అతిపె ద్ద పరిశ్రమ వ్యవసాయం, ఆహార రంగమే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ దక్షిణ మండల కిసా న్ మేళాను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి నిరంజన్రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో ఎం త భూమి ఉందో, ఏ పంట వేస్తున్నారో దేశంలో ఎక్కడా లేని విధంగా శాస్త్రీయం గా గ ణాంకాలు ఉన్నాయన్నారు. దేశంలో అన్నానికి కొదువలేని ఉత్పత్తులు వచ్చాయన్నారు. కార్లు, జీపులు, విమానా లు లేకున్నా బతుకొచ్చని.. ఆహారం లేకుంటే మాత్రం జీవుల మనుగడ కష్టమవుతుందన్నారు. మనందరి క డుపు నింపుతున్న రైతును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పట్టణీకరణతో సాగుకు యోగ్యమైన భూమి శాతం తగ్గుతుందన్నారు. ఉన్న భూమిని వినియోగించుకొని సహజ సిద్ధంగా సారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు కచ్చితంగా భూసా ర పరీక్షలు చేయించాలని మంత్రి కోరారు. భూమిలో కర్బన శాతం లేకుంటే ఎంత పెట్టుబడులు పెట్టినా మొ క్కలు ఎదగవన్నారు. ఎండాకాలంలో సేంద్రియ ఎరువులతో సాగుకు యోగ్యంగా మార్చుకోవాలన్నారు. ఆ కులు, అలాలు మురగబెట్టడం, ఒండ్రు మట్టి వేయడం తో భూ కర్బన శాతం పెరుగుతుందన్నారు. కర్బనశాతం ఏడు వరకు ఉండాల్సి ఉండగా.. దేశంలో సగటున 1 శాతం మాత్రమే ఉందని తెలిపారు. రైతులు 50 శాతం ఎరువులు తగ్గించుకుంటే.. దేశంలో ఏటా రూ.50 వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. రైతులు ఇండ్ల వద్ద పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి జీవాలు పెంచుకోవాలన్నారు. పండ్లతోటలు, కూరగాయల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే రైతు ల కష్టాలు తొలగుతాయని భావించి గులాబీ జెండా పట్టానన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ సర్టిఫికెట్ లేని శాస్త్రవేత్తగా మారానన్నారు. సేంద్రియ ఎ రువులతో పంట, కాత ధృడంగా ఉంటుందన్నా రు. ఉత్పత్తులను పెంచే దిశగా సేద్యం చేయాలన్నారు. భవిష్యత్తులో శాస్త్రీయంగా ఆలోచించే పాలకులు ఉం టే.. ప్రపంచమంతా మన దేశంపై ఆధారపడే పరిస్థితు లు వస్తాయన్నారు.
భూసారం పెంచుకునేందుకు పిల్లి పెసర, జీలుగ విత్తనాలను విరివిగా ఉపయోగించాలన్నారు. అంబానీ, ఆదానీ వంటి ధనవంతులు కూడా జొన్న, గట్కలు తింటున్నారన్నారు. తెలంగాణలో వానకాలంలో 65 లక్షల ఎకరాలు సాగు చేసి దేశంలోనే నం బర్వన్లో నిలిచామని చెప్పారు. ఎన్టీఆర్ వచ్చాకే బి య్యం పండించారని ఓ పనికి మాలిన సినిమా యాక్టర్ అన్నారని.., అలాంటి మూర్ఖుడిని ఎక్కడా చూడలేదని విమర్శించారు. కాకతీయరెడ్డి రాజులు, విష్ణుకుండిలు కట్టించిన చెరువులు, కుంటల కింద పండించే వరికి ఎం తో పేరు ఉండేదన్నారు. సమైక్య రాష్ట్రంలో మూర్ఖపు పా లనతో సాగునీరు అందించక, ప్రాజెక్టులు నిర్మించక భూములను ఎండబెట్టారన్నారు. అమెరికా నుంచి సై తం తెలంగాణ పల్లెల్లోకి వచ్చి వ్యవసాయ పొలంలో ఇ ల్లు కట్టుకొని మేకలు పెంచుతున్నారన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార సంక్షోభం వస్తుందన్నారు. అంతకుముందు రూ.93లక్షలతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జె డ్పీ చైర్మన్ బాలాజీసింగ్, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పరిశోధన స్థానం స హాయ సంచాలకుడు గోవర్ధన్, కోరమాండల్ ఉపాధ్యక్షు డు సుబ్బారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్, ఆర్ఏసీ శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ లావణ్య ఉన్నారు.