మహబూబ్నగర్ టౌన్, జనవరి 10 : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేతగా ఖమ్మం ఆపరేషన్ జట్టు నిలువగా, రన్నర్గా మహబూబ్నగర్ ఆపరేషన్ జట్టు నిలిచింది. బుధవారం స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఖమ్మం ఆపరేషన్ జట్టు 25-21, 25-18 సెట్ల తేడాతో మహబూబ్నగర్ ఆపరేషన్ జట్టుపై విజయం సాధించింది. అలాగే హైదరాబాద్ జట్టు 21-19, 23-18 సెట్ల తే డాతో నల్లగొండ ఆపరేషన్ జట్టుపై గెలిచి మూడోస్థానంలో నిలిచింది.
నల్లగొండ ఆపరేషన్ నాలుగోస్థానం దక్కించుకున్నది. విజేతలకు విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీరామ్మూర్తి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటము లు సహజమన్నారు. ఉద్యోగులకు ఒత్తిడి దూరం అవుతుందనే పోటీలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, డీఈలు చంద్రమౌళి, వెంకటశివరామ్, కృష్ణమూర్తి, బాషా, ప్రసాద్రావు, మోహనకృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, గేమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షకీల్, శ్రీనివాస్ ఉన్నారు.