మహబూబ్నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బాధలు తీర్చే సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తే సహించమని, పాలమూరును బాగుచేసిన దైవం అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అంతటి మహోన్నత నేతపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముందుగా మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో మన ఓట్లతో రాజభోగాలు అనుభవించిండ్రు.. రూ.కోట్లు గడించారు.. అలాంటి నాయకులకు ఇక్కడి నేతలు హారతులు పట్టారని విమర్శించారు.
పాలమూరు జిల్లానుంచి వలసలు పోతుంటే పట్టించుకోని నాయకులు నేడు మనబాధలు తీర్చేందుకు వచ్చిన మన నాయకుడిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మనకు అన్నంపెట్టిన నేతని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మనదైవాన్ని ఎవరైనా.. ఏమన్నా మహబూబ్నగర్ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. దేశం బాగుపడాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్న మీ వెంట ఉంటామని, ఎన్నిశక్తులు అడ్డొచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.
రాష్ట్ర జీడీపీ రూ.11.54 లక్షల కోట్లకు..
రాష్ట్ర జీడీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి నేడు రూ.11.54 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వెల్లడించారు. ఏ ఒక్క రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాలమూరు 13వది అని అన్నారు. రూ.60వేల కోట్ల వా ర్షిక బడ్జెట్ ఉంటే గతేడాది రూ.1.84లక్షల కో ట్లకు చేరిందన్నారు. 10 జిల్లాలను 33జిల్లాలుగా, 612 మండలా లు, 142 మున్సిపాలిటీలుగా మార్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే చెందేలా చేశామని, 85 వేల ఉద్యోగాలకు విడుతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.
కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పీ రాములు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, మహేశ్రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ రాజేశ్వర్గౌడ్, జెడ్పీ చైర్మన్లు, చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు, పార్టీ నాయకులు రాజేశ్వర్, శ్రీకాంత్గౌడ్, సుదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.