తెలంగాణకు ముందు ఒక్క పార్కు లేదు
ఇప్పుడు ఎక్కడ చూసినా పార్కులే..
ప్రతి శిల్పారామంలో మహాబ్రాండ్ ఉత్పత్తులు
మహిళలు స్వయం శక్తితో బతికేలా చేస్తాం : మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 24 : దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. రూ.8.71 లక్షలతో నిర్మించిన ఊటకుంట, రూ. 3.70 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, రూ.1.86 లక్షలతో ఏర్పాటైన బట్టర్ఫ్లై సెల్ఫీ పాయింట్తోపాటు మహాబ్రాండ్ ఉత్పత్తులు విక్రయించేందుకు స్టాల్ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడు తూ తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్నగర్ పట్టణంలో కనీసం ఒక్క మంచి పార్కు లేదన్నారు.
తెలంగాణ వచ్చాక 30కి పైగా పార్కులు జిల్లాలో ఏర్పాటయ్యాయన్నారు. ఇక్కడ వెదజల్లిన విత్తన బంతులతో గిన్నిస్ రికార్డు సృష్టించినట్లు తెలిపారు. మహా బ్రాండ్ ద్వారా జిల్లా మహిళా స్వయం సహాయక సభ్యులు పలు ఉత్పత్తులు తయారు చేసి ఆన్లైన్లో పోర్టల్ ద్వారా విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శిల్పారామంలో మహా బ్రాండ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపా షా, డీఎఫ్వో గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహు లు, ఆర్డీవో యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కళలను ప్రోత్సహించాలి..
మహబూబ్నగర్, జూన్ 24 : కళల ను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సంగీత, నృత్య కళాశాలను మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కళాశాలను భవిష్యత్తు లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నాదస్వర విధ్వాంసులు, కళాకారులను తయారు చేసేందుకు కళాశాల ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కోర్సు చేసిన వారికి లభించే డిప్లొమా స ర్టిఫికెట్తో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నాయీ బ్రాహ్మణులు నాదస్వర వృత్తితో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కళాకారులకు చేయూతనిచ్చామని స్ప ష్టం చేశారు. పట్టణంలో నాయీబ్రాహ్మణనులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, వీధి వ్యాపారుల దుకాణాలు అందించి ఆదుకున్నామని చెప్పారు. భవిష్యత్తులోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రిన్సిపల్ రాఘవరాజ్భట్, రాం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం
మహబూబ్నగర్ను అద్భుతంగా అ భివృద్ధి చేసుకుందామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో కేటీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఏర్పాటు చే సిన గ్రామ దేవత పోచమ్మదేవి, బొడ్రా యి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతం మీదుగా బైపాస్ రోడ్డు వెళ్తుందన్నారు. తక్కువ సమయంలోనే కోస్గి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కేటీఆర్ నగర్లో నిర్మించిన డబుల్ ఇండ్లు ప్రశాంత వాతావారణంలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాం తానికి సమీపంలోనే రూ.80 కోట్లతో గు రుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జ్యోతి తదితరులున్నారు.