ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారుల మనోగతం రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే ఊరూరా క్రీడా ప్రాంగణాలను.. నియోజకవర్గానికో స్టేడియాన్ని నిర్మించింది. కొన్ని ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియాలకూ నిధులు కేటాయించింది. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, త్రోబాల్, బాస్కెట్బాల్, లాంగ్జంప్, హైజంప్ శిక్షణకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది. ఇదే పాలసీ దేశ వ్యాప్తంగా అమలైతే పతకాల పంట పండనున్నదని, అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశం చేయాలని ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వారి మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఉద్యమనేత నేషనల్ పాలిటిక్స్లోకి వస్తే భారత్ క్రీడా పాలసీ పూర్తిగా మారి మహర్దశ పట్టనున్నదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 21 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : కామన్వెల్త్, ఒ లింపిక్స్, అథ్లెటిక్స్ క్రీడలేవైనా దేశం పె ద్దది.. కానీ, పతకాల లిస్ట్లో చిన్నది. చిన్నచిన్న దేశాలు బంగారు పతకాలు సాధించి రికార్డు సాధిస్తుంటే.. మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కరువై పతకా ల వేటలో వెనుకబడుతున్నారు. ఈ ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల తో రాష్ట్ర క్రీడాకారులు పతకాల పంట పం డిస్తున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో స్పోర్ట్స్ అథారిటీ, క్రీడాశాఖల ఆధ్వర్యంలో విదేశాల్లో మన క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్నారు. విజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మన దేశం పతకాల పట్టికలో ముందు వరుసలో ఉంటుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశం లో క్రీడాపాలసీ లేకపోవడంతోనే ఎంతోమంది క్రీడాకారులు వెనుకబడుతున్నారని, స్పోర్ట్స్ క్లబ్లలో రాజకీయ జోక్యాన్ని తొలగించి రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసిన అకాడమీలతో ఎంతోమంది క్రీడాకారులు రూపుదిద్దుకుంటున్నారన్నారు. తెలంగాణలో క్రీడాకారులకు మహర్దశ చేకూర్చిన కేసీఆర్ తమ పాలిట ద్రోణాచార్యుడని కొనియాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ క్లబ్ల్లో రాజకీయాలు జొప్పించి అనేక మంది క్రీడాకారుల భవిష్యత్ను నాశనం చేశారని, తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నారు. అనేక మంది ప్రపంచ క్రీడాకారులకు కేసీఆర్ తగిన గౌరవం ఇచ్చారన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఆడుకునేందుకు అనేక వసతులు కల్పించారని, ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదంటున్నారు. అందుకే ఇలాంటి విజన్ ఉన్న నేత జాతీయ రాజకీయాల్లో వస్తే క్రీడా పాలసీ పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
నియోజకవర్గానికో స్టేడియం
రూ.కోట్లు ఖర్చుపెట్టి నియోజకవర్గానికో స్టేడియం నిర్మించారు. కొన్ని చోట్ల ఇండోర్ స్టేడియాలకు నిధులు సమకూర్చారు. నిష్ణాతులైన కోచ్లతో వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, త్రోబాల్, లాంగ్జంప్, హైజంప్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. పా ర్కు, స్టేడియంలలో వాకింగ్ కోసం ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేశారు. దీంతో కానిస్టేబుల్, ఎస్సై ఫిజికల్టెస్ట్లకు ఫుల్ కాంపిటీషన్ ఏర్పడింది. జిల్లాకో అకాడమీ ఏర్పా టు చేసి ఆయా ప్రాంతాల్లోని చాలామందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందని క్రీడాకారులు అంటున్నారు. ఇటీవల బర్మింగ్హాంలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చడంతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పతకాల పట్టికలో ఎన్నడూ లేని విధంగా మన దేశం ఎగబాకింది. హర్యానా తర్వాత తెలంగాణ క్రీడాకారులే ఎక్కువ పతకాలు సాధించారు. జిల్లాకు చెందిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బర్మింగ్హాంకు వెళ్లి ప్రోత్సహించారు. కస్తూర్బా, గురుకుల, మోడల్ పాఠశాలల్లో క్రీడాకారులకు తగిన ప్రో త్సాహం ఇవ్వడంతో ప్ర పంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిం చి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చే శారు. కేసీఆర్ జాతీ య రాజకీయాల్లో వస్తే గ్రామీణ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని, దేశకీర్తిని ప్రపంచంలో పెంచుతారని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ లాంటి నేతలే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
తెలంగాణలోలాగా దేశంలో కూడా అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగుతారు. దేశానికి మన రాష్ట్రం రోల్మోడల్. వెనుకబడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ద్వా రా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి. ఇదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లోనూ అడుగుపెట్టి విజయం సాధిస్తాడన్న ధీమా అందరిలోనే ఉన్నది. దేశంలో క్రీడాకారులకు తోడ్పాటు అందిచడం లేదు. కేసీఆర్తోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉన్నది. కేసీఆర్ పీఎం అయితే దేశంలోని యువత, రైతులు సంతోషంగా ఉంటారు.
– గొల్ల రవికిరణ్, వాలీబాల్ క్రీడాకారుడు, మరికల్
కేసీఆర్ వెంట నడవాలి..
ప్రస్తుతం దేశంలో మతతత్వ పాలన కొనసాగుతున్నది. కుల, మత రాజకీయ పిచ్చి పోవాలంటే నూతన నాయకత్వం అవసరం. దేశ ప్రజలంతా కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారు. విప్లవాత్మకమైన మార్పు కోసం కేసీఆర్ రావాలి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రం రాష్ర్టానికి సహకరించడం లేదు. దేశంలోని దరిద్ర పాలనను మట్టుబెట్టి భారత ప్రజలకు సుస్థిరమైన పాలనను అందించాలంటే కేసీఆర్ వల్లే సాధ్యం. ఆయన పీఎం అయితే దేశంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్ వెంట నడవాలి.
– బి.రూప, జాతీయ క్రీడాకారిణి, మక్తల్
మార్పు కోరుకుంటున్న ప్రజలు..
రాష్ట్రంలాగే భారతదేశం కూడా అభివృ ద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. కాంగ్రెస్, బీజేపీ పా ర్టీలు దేశాన్ని పాలించడంలో విఫలమయ్యాయి. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ సేవలు ఎంతో అవసరం. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రంలాగే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. కేసీఆర్ ప్రధాని అయ్యేంత వరకు దేశ ప్రజలంద రూ ఒకే తాటిపైకి రావాలి.
– దీప, జాతీయ క్రీడాకారిణి, మక్తల్
కేసీఆర్తోనే క్రీడాభివృద్ధి..
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం చేయొచ్చు. అలాంటి క్రీడలను పట్టించుకోవడం లేదు. బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో క్రీడారంగాన్ని క్రీడారంగంలో అన్ని దేశాల కంటే వెనుకబాటుకు గురిచేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ఎస్జీఎఫ్, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడాకారులకు గుర్తింపు లభించింది. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అయితే క్రీడారంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు.
– ఎడ్మ శ్రీనుయాదవ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి, నాగర్కర్నూల్
క్రీడలకు ఎనలేని ప్రాముఖ్యత..
రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా క్రీడాకారులకు ప్రాంగణాలు నిర్మించడంతోపాటు చక్కటి శిక్షణ తరగతులు నిర్వహించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాల్గొనే అవకాశం కల్పిస్తున్నది. రాష్ట్రం తరహాలోనే దేశంలో క్రీడారంగానికి ప్రాధాన్యత కల్పించాలన్నదే నా ఆకాంక్ష. ఇది కేవలం కేసీఆర్ పాలనలోనే సాధ్యం. దేశమంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నది.
– రఘు, పీఈటీ, అయిజ
మన సీఎం కీలక పాత్ర వహించాలి..
ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన నడుస్తున్నది. కేవలం ఇద్దరు వ్యక్తులు తమ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర వహించాలి. దేశంలో యువత, క్రీడాకారులకు మంచి భవిష్యత్ కావాలంటే కేసీఆర్ పీఎం కావాలి. స్వార్థ రాజకీయల కోసం దేశంలోని కార్పొరేట్కు అమ్ముడుపోతున్న రాజకీయ పార్టీలకు ఉద్వాసన పలకాలి. బీజేపీ పీడ విరగడ కావాలి. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం చేపడుతున్నట్లు దేశంలో కూడా
నిరుద్యోగం పోవాలి. ఇది కేసీఆర్కే సాధ్యం.
– సుధాకర్గౌడ్, వాలీబాల్ క్రీడాకారుడు, మరికల్
రాష్ట్రం తరహాలో అభివృద్ధి..
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ఎంతో శుభపరిణామం. కులమతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. అదే నాయకత్వం దేశానికి అవసరం. తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశాభివృద్ధి జరగాలి. అది కేవలం కేసీఆర్తోనే సాధ్యం. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ పీఎం అయితే రాష్ట్రం, దేశం అగ్రగామిలో నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సబ్బండ వర్గాల బాధలు తీరాలంటే కేసీఆర్ పాలన కావాల్సిందే.
– మంజునాథ్, క్రీడాకారుడు, గద్వాల