అన్నదాత సుఖీభవ.. రూ.5కే కడుపునిండా భోజనం పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ సారు చల్లగా ఉండాలని పేదలు దీవెనలు అందిస్తున్నారు. ఆకలితో ఉన్న వారికి రుచికరమైన భోజనాన్ని గద్వాల జిల్లా కేంద్రంలో అందిస్తున్నారు. కేసీఆర్ క్యాంటీన్ పేరిట నిత్యం 550 నుంచి 600 మంది ఆకలి తీరుస్తున్నారు. కార్మికులు, కళాశాల విద్యార్థులు, వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు వ్యాపారాలు, పనుల కోసం నిత్యం వచ్చే వారికి వడ్డించే అన్నంతోపాటు వాటర్ ప్యాకెట్లు ఉచితంగానే అందిస్తున్నారు.
గద్వాల, అక్టోబర్ 29 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి పని నిమిత్తం నిత్యం వేల మంది వచ్చిపోతుంటారు. ముఖ్యంగా పల్లెటూరు నుంచి ప్రజలు ప్రతిపనికీ జిల్లా కేంద్రానికి రావాల్సిందే. పని ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే ఎంతో సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజనం చేయాలంటే హోటళ్లే దిక్కు. రూ.100 పెడితే గానీ కడుపునిండా భోజనం చేయలేరు. ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది పస్తులు ఉండి ఇంటికి వెళ్లి తినేవారు. అలాంటి వారి ఆకలి బాధలు తీర్చేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కేసీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. రూ.5కే కడుపు నిండా భోజనం అందిస్తున్నాడు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు వ్యాపారాలు చేసుకునే వారికి కేసీఆర్ క్యాంటీన్ ఆకలి తీరుస్తున్నది. ఈ క్యాంటీన్ ద్వారా నిత్యం సుమారు 600 మందికి భోజనం పెడుతున్నారు. సంతరోజు 700 మందికిపైగా ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారు. సన్న బువ్వతోపాటు చట్నీ, సాంబారు ఇస్తున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా భోజనం అందిస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భోజనం చేసిన వారికి వాటర్ ప్యాకెట్ కూడా ఉచితంగా అందిస్తున్నారు.
భోజనం మంచిగా ఉన్నది..
నేను ప్రతిరోజూ జిల్లా కేంద్రానికి వచ్చి సీతాఫలం పండ్లు అమ్ముతుంటాను. హోటల్కు వెళ్తే భోజనానికి రూ.70 నుంచి రూ.100 అవుతున్న ది. పండ్లు అమ్మితే వచ్చిన లాభమం తా భోజనానికే అవుతున్నది. కుటుం బ పోషణ భారంగా మారింది. కేసీఆ ర్ క్యాంటీన్ ప్రారంభమైన నాటి నుంచి ఇక్కడే మధ్యాహ్న భోజనం చేస్తున్నాను. రూ.5కే ఇంత మంచి భోజనం ఎక్కడా దొరకదు. సన్నబువ్వ అందిస్తున్న కేసీఆర్ సార్, ఎమ్మెల్యే సల్లంగా ఉండాలి.
– జయమ్మ, అజ్జకొల్లు
చట్నీ, సాంబార్ బాగుంది..
పేదల ఆకలి తీర్చిన వారిని దేవు డు ఎప్పుడూ సల్లంగా చూస్తాడు. రూ.5కే భోజనం పెట్టడంతో నా లాంటి పేదవారికి ఎంతో మేలు. వేరే ఊరు నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునే వారికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. రూ.5కే అందిస్తున్న భోజనం ఎంతో రుచిగా ఉన్నది. చ ట్నీ, సాంబారు ఇస్తున్నారు. తిన్నాక నీళ్లకు ఇబ్బందవుతుందని వాటర్ ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నారు.
– మంగమ్మ, అజ్జకొల్లు
పేదవారికి ఎంతో మేలు..
పట్టణానికి వచ్చి పనులు చేసుకునే వారికి కేసీఆర్ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రస్తుత పరిస్థితి లో రూ.5కు ఏ వస్తువూ రాదు. అటువంటిది కడుపు నిండా అన్నం పెట్ట డం అంటే అంత సులువు కాదు. ఇది కార్మికులకు, విద్యార్థులకు ఎంత మే లు. భోజనం నాణ్యతతో ఉంటుంది. భోజనం అందిస్తున్న వారికి పేదలు రుణపడి ఉంటారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– హనుమంతు, గుంటిపల్లి