మాగనూర్, డిసెంబర్ 12 : మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు, కంపౌండ్, గేట్ లేక విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. బాలికల చదువు మధ్యలో ఆగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ ల క్ష్యంతో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమస్యగా మారింది. పాఠశాలకు స్థలం కొరతతో మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అధికారులు భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సింది ఉండగా నిర్వహణ లోపంతో అవి కా స్త మధ్యలోనే పడిపోయాయి. ఎవరు ఉండని ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేశారు.
రాత్రి వే ళలో లోపకి ఎవరు వచ్చి ఏ ఇబ్బందులు కలిగిస్తారో తెలియని గందరగోళ పరిస్థితుల నడు మ విద్యార్థినులు జీవిస్తున్నారు. అడిగే దిక్కులేని పరిస్థితి పాఠశాలకు అతి సమీపంలో వైన్స్ షాపు ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతున్నదోనని విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పాఠశాలకు వెళ్లే దారిలో విధిదీపాలు లేక రాత్రి సమయంలో విద్యుత్ పోతే అంతే సంగతులు. పాఠశాలలో సీసీ కెమెరాలు నాలుగు మాత్రమే ఉన్నాయి..
మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్న పట్టించుకునేవా డు లేడు. సంబంధింత అధికారి జీసీడీవో నమా మాత్రంగా తనిఖీలు, కల్లిబొల్లి మాటలు చెప్పడం తప్ప పనిచేసి విద్యార్థులకు భద్రత కల్పిస్తామని ఏ మాత్రం చెప్పడం లేదని బా లికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ను సందర్శించి నెల 15 రోజులైన బాలికల భద్రతపై ప ట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్న జీసీడీవోపై కల్లెక్టర్ చర్యలు తీసుకొన్ని విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.