నారాయణపేట, జనవరి 11: రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగలా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్హాల్లో బుధవారం వైద్య ఆరోగ్య శా ఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు అవగాహన సదస్సుకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కంటి చూపు బాగుండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు మది నుంచి వచ్చిన గొప్ప కార్యక్రమం కంటి వెలుగన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఏ ఒక్కరికీ కంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు.
పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని, రెండో విడుత ఈనెల 18 నుంచి జూన్ 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బృందాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించడం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరుగలేదన్నారు. రానున్న రోజుల్లో కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కనుందన్నారు. జిల్లాలో మొత్తం 24 బృందాలు 100 పని దినాల్లో కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగులో ప్రజాప్రతినిధులు భాగస్వాములై కంటి సమస్య లు ఉన్న ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు కృషి చేయాలన్నారు. చూపు లేనివారి జీవితం దుర్భ రంగా ఉంటుందని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలో 4లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని, 24 బృం దాలతోపాటు అదనపు బృందాన్ని నియమించామన్నారు. బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో 20, మున్సిపాలిటీల్లో 4 బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షల అనంతరం దగ్గరిచూపు సమస్య ఉన్నవారికి అక్కడికక్కడే అద్దాలు ఇస్తామని, మిగతా సైట్లు ఉన్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి 15 రోజుల్లో ఇంటివద్దకు వచ్చి అద్దాలు ఇస్తామన్నారు. కంటి వెలుగు అవగాహన, ప్రారంభోత్సవాలు, అద్దాల పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పా ల్గొనాలని కోరారు. అనంతరం అవగాహన కరపత్రాన్ని వి డుదల చేశారు. సదస్సులో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, పద్మజారాణి, పేట, కోస్గి మున్సిపల్ చైర్పర్సన్లు అనసూయ, శిరీష, పేట మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీసీఎస్ చైర్మన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.