జడ్చర్లటౌన్, ఏప్రిల్ 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన శిబిరాలను శుక్రవారం అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల మండలంలో మొత్తం 18.960మందికి పరీక్షలు నిర్వహించి 2,896మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 2,330 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేయగా, 1,444 కండ్లద్దాలు వచ్చినట్లు చెప్పారు. అలాగే మున్సిపాలిటీలో మొత్తం 17,591మందికి పరీక్షలు నిర్వహించి 2,816 మందికి అద్దాలను అందజేశామన్నారు. మరో 1,579 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశామన్నారు. శుక్రవారం గంగాపూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 644మందికి కంటి పరీక్షలు నిర్వహించి 63మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 48మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అలాగే మున్సిపాలిటీలో 334 మందికి పరీక్షలు నిర్వహించి 31మందికి అద్దాలను అందజేశారు. మరో 19మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
మిడ్జిల్, ఏప్రిల్ 21 : అంధత్వరహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సుదర్శన్ అన్నారు. మండలంలోని కంచనపల్లిలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 130మందికి కంటి పరీక్షలు నిర్వహించి 20మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 25మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అక్తర్బేగం, మాజీ సర్పంచ్ నర్సింహులు, రఫీ, వైద్యసిబ్బంది జంగయ్య పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఏప్రిల్ 21 : కంటివెలుగు కార్యక్రమం లో భాగంగా రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, అగ్రహారం పొట్లపల్లి, రంగారెడ్డిగూడ, దొండ్లపల్లి, రాఘవాపూర్, తిర్మలాపూర్, కుచ్చర్కల్, చెన్నవెల్లి గ్రామాల్లో 8,064 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2,094మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 528మందికి అవసరమైన అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్లు రవికుమార్, సురేశ్ రాథోడ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఏప్రిల్ 21 : మండలంలోని బోడగుట్టతండాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ రమేశ్నాయక్ ప్రారంభించారు. కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తండావాసులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అరుణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి వినోద్కుమార్ పాల్గొన్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), ఏప్రిల్ 21 : కౌకుం ట్ల, చిన్నచింతకుంట మండలాల్లో కంటివెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. కౌకుంట్ల మండలం పుట్టపల్లిలో 151మందికి కంటి పరీక్షలు నిర్వహించి 14మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 15మం దికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. చిన్నచింతకుంట మండలం ఉంద్యాలలో 161మందిని పరీక్షించి నలుగురికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 8మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ముచ్చింతలలో 182 మందికి పరీక్షలు నిర్వహించి 26మందికి అద్దాలను అందజేయగా, మరో 64మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీక్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, శ్రీనివాసులు, ఖాదర్, సుశీల పాల్గొన్నారు.