మహ్మదాబాద్, జనవరి 19 : రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్రెడ్డి, తాసిల్దార్ ఆంజనేయులు, ఎంపీవో శంకర్నాయక్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు సహకరించాలి:అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్
జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. హన్వాడలో గురువారం నిర్వహించిన కంటివెలుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సల్లోనిపల్లిలో డీఆర్డీఏ పీడీ యాద య్య, టంకరలో జెడ్పీటీసీ విజయనిర్మల కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సింగిల్విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ గంగాపురి, మండల కోఆప్షన్ సభ్యుడు మన్నాన్, కార్యదర్శి వెంకటయ్య, సర్పంచ్ లక్ష్మీనారాయణ, అచ్చన్న, రేవతి, డాక్టర్లు శ్వేత, ప్రగతి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అల్లీపూర్లో..
మహబూబ్నగర్ మండలం అల్లీపూర్ గ్రామంలో సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలున్న వారిని పరీక్షించి ప్రభుత్వం ఉచితంగా అద్దాలు, తగిన మందులు అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ అనిత, పీఏసీసీఎస్ కోటకదిర చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, ఉపసర్పంచ్ ఉషన్న, వార్డుసభ్యులు, వైద్యాధికారులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా:ఎంపీపీ శేఖర్రెడ్డి
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం 2వ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని హస్నాపూర్, మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు రాందాస్తండాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ గురువారం ప్రారంభించారు. రాందాస్తండాలో నిర్వహిస్తున్న శిబిరాన్ని అదనపు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆ ఫీసర్ డాక్టర్ సంధ్యాకిరణ్మయి, పీఏసీసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, సర్పంచ్ రాములమ్మ, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్ నజీబ్, ఎం పీవో విజయకుమార్, డాక్టర్ అబ్దుల్బ్బ్రు, ముడా డైరెక్టర్ సాయిలు, సీహెచ్వో రామయ్య, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, నర్సిరెడ్డి, అశోక్, నర్సిములుయాదవ్, సూపర్వైజర్లు యాదమ్మ, సుధాకర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు
కంటి వెలుగు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ఎమ్మె ల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలో ని జానంపల్లి, అంచన్పల్లి గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు రవికుమార్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.
అడ్డాకులలో..
ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అడ్డాకులలో గురువారం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆల ప్రారంభించి పలువురికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల, డాక్టర్ అపర్ణ, సర్పంచ్ మంజుల, పంచాయతీ సభ్యులు, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ రంగన్నగౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంధత్వ నివారణకే ‘కంటివెలుగు’
రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్ పేర్కొన్నారు. మండలకేంద్రంతోపాటు బస్వాయిపల్లిలో గురువారం కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకధికారి టైటస్పాల్, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, వైద్యులు శరత్చంద్ర, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు
ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడమే ‘కంటి వెలుగు’ లక్ష్యమని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని కొతలాబాద్, పారుపల్లి, కోయిలకొండ గ్రామాల్లో శిబిరాలను గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో నవోదయ చైర్మన్ రవీందర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్గౌడ్, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో శిబిరం
అన్ని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి అద్దాలు అందజేస్తున్నట్లు ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు అన్నపూర్ణ, రాజేశ్వరి పేర్కొన్నారు. కార్యక్రమాల్లో తాసిల్దార్లు శివరాజు, సువర్ణారాజు, ఎంపీడీవోలు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.