మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 3 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వరహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభు త్వం కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఉచితంగా కండ్లద్దాలతోపాటు అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం పలువురికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్రా యాత్రికుడికి సన్మానం
మహబూబ్నగర్టౌన్, మార్చి 3 : జిల్లా కేంద్రంలోని బోయపల్లి నుంచి ఉమ్రాయాత్రకు వెళ్తున్న మహ్మద్ షకీల్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా సన్మానించారు. ఉమ్రాయాత్రలో దేశ ప్రజల క్షేమం కోసం ప్రార్థించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాములు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పాలమూరు, మార్చి 3 : మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్కు చెందిన ముడా డైరెక్టర్ కాడం ఆంజనేయులు సోదరుడు వెంకటేశ్ అనారోగ్యంతో మృతి చెందా డు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం జమిస్తాపూర్కు చేరుకొని అతడి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకుముందు వెంకటేశ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ధర్మాపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంతరెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా, అతడి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కు టుంబసభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, సర్పంచ్ రాం చంద్రయ్య తదితరులు ఉన్నారు.