మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం బుధవా రం ముమ్మరంగా సాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాల ను ఏర్పాటు చేసి 6,730మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపంతో బాధపడుతున్న 1,080మందికి అద్దాలను అందజేశారు. మరో 557మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఇప్పటివరకు 72, 721మందిని పరీక్షించి 11,327మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
నవాబ్పేట, ఫిబ్రవరి 1 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈవో జ్యోతి కోరారు. మండలంలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు, అద్దాల పం పిణీ వివరాలను తెలుసుకున్నారు. 18ఏం డ్లు నిండిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, సర్పంచ్ సౌజన్యారఘు, జీహెచ్ఎం జగదీశ్ పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్వో పరిశీలన
భూత్పూర్, ఫిబ్రవరి 1 : మున్పిపాలిటీలోని నాల్గోవార్డులో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని బుధవారం డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్ పరిశీలించారు. నాల్గోవార్డులో 232మందికి పరీక్షలు నిర్వహించి 65మందికి కండ్లద్దాలను పంపి ణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. కప్పెటలో 106మందిని పరీక్షించి 24మందికి అద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్ రబ్బు, హిమబిందు, రాధిక, సూపర్వైజర్లు యాద మ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 1 : మున్సిపాలిటీలోని 3, 15 వార్డుల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో 334 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 84మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 22మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. అదేవిధంగా మండలంలో ని గంగాపూర్, చిన్న ఆదిరాల గ్రామాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. గంగాపూర్లో 79మందిని పరీక్షించి ఆరుగురికి అద్దాలు పంపిణీ చేశారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. చిన్న ఆదిరాలలో 110మందికి పరీక్షలు నిర్వహించి 16మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 10మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 1 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రం లో 178మందికి కంటి పరీక్షలు నిర్వహించి 22మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 18మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే చిన్నరేవల్లిలో 109మందిని పరీక్షించి 25మం దికి కండ్లద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఫిబ్రవరి 1 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 139మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న 13మందికి అద్దాలు పంపిణీ చేయడంతోపాటు మరో 8మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాం బాయి, కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్ మౌనిక, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, పిబ్రవరి 1 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర, చౌదర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలు కొనసాగాయి. దేవరకద్రలో 110మంది, చౌదర్పల్లిలో 120మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలను అందజేసిన ట్లు డాక్టర్ శరత్చంద్ర తెలిపారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 1 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా అడ్డాకులలో 149మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, అద్దాలను అందజేసినట్లు సీహెచ్వో భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు అపర్ణ, వీరస్వా మి, భాస్కర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 1 : కౌకుం ట్ల మండలంలోని 116మందికి కంటి పరీక్షలు నిర్వహించి 13మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపా రు. చిన్నచింతకుంటలో 146మందిని పరీక్షించి 11మందికి అద్దాలను పంపిణీ చేశా రు. మరో 12మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. అప్పంపల్లిలో 154మందికి కంటి పరీక్షలు నిర్వహించి 22మందికి అద్దాలను అందజేశారు. మరో 29 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీఖ్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, ఖాదర్, సూపర్వైజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఫిబ్రవరి 1 : మండలకేంద్రంతోపాటు కొత్తపల్లిలో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. మొత్తం 216మందికి పరీక్షలు నిర్వహించి 41మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 32మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు మనుప్రియ, కృష్ణకుమార్, సి బ్బంది దేవయ్య, జంగయ్య పాల్గొన్నారు.