మూసాపేట(అడ్డాకుల), మార్చి 24 : దక్షిణ కా శీగా పేరుగించిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారులు తమ్మలి వంశస్తుల ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. మంగళవాయిద్యాలు, బాజాభజంత్రీలు, భజనలు చేస్తూ అత్యంత వైభవంగా స్వామి ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా పూర్వపు ఆచారం ప్రకారం గ్రామానికి చెందిన దళి త కుటుంబ సభ్యులు మొదటి దాసంగాలు సమర్పించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రభోత్స వం నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము న నిర్వహించే రథోత్సవానికి అలంకరణ చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజ లు చేశారు. అలాగే హోమం, కుంబాభిషేకం, తెప్సోత్సవం తదితర ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.