నాగర్కర్నూల్, జూన్ 5 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు చేపట్టారు. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో బహిరంగ సభకు ప్రాంగణం ముస్తాబైంది. ఈ ఏర్పాట్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, కలెక్టర్ ఉదయ్కుమార్ సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వందేండ్ల ముందుచూపుతో సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదన్నారు. అనంతరం కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను మంత్రి పరిశీలించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లతో పట్టణమంతా గులాబీమయమైంది. నాగర్కర్నూల్ నుంచి సభాస్థలం వరకు భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు. వారి వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్కా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్యాదవ్ తదితరులున్నారు.