బాలానగర్, డిసెంబర్ 10 : మారుతు న్న కాలానుగుణంగా ప్రపంచమంతా అ రచేతిలోనే ఉన్నది. ఇంటివద్ద నుంచే అ న్ని రకాల సేవలు పొందే అవకాశం ఏర్పడింది. పౌరసేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆధునిక సమాచార ప్రపంచంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటున్నది. అయినా, ఇంటివద్ద నుంచే సేవలు పొందాల్సి ఉన్నా.. అవగాహన లోపంతో చాలా మంది మీ సేవ, సర్వీస్ సెంటర్లు, దళారులను ఆశ్రయించి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.
కొంచెం అవగాహన పెంచుకుం టే సేవలను తక్కువ డబ్బులు వెచ్చించి.. సమయాన్ని ఆదా చేసుకుంటూ సులభంగా పొందొచ్చ…? మీ సేవ కేంద్రాల్లో చేసుకునే ప్రతి దరఖాస్తునూ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. టీఎస్, మీ సేవ అని గూగుల్ లో సెర్చ్ చేసి ముందుగా సిటిజన్ లాగిన్ పొందితే చాలు. సిటిజన్ లాగిన్కు కేవ లం ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్ల నుంచి ప్రతీది ఐప్లె చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తరువాత వ చ్చిన రసీదు నెంబర్తో మీ సేవ కేంద్రా ల్లో సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవచ్చు….? ప్రస్తుతం ఆధార్కార్డుతోపాటు పాన్కార్డు తప్పనిసరిగా మారింది. ఈ క్ర మంలో కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్లో నుంచి పాన్కార్డుకు ఐప్లె చేసుకోవచ్చు.
https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్సైట్లో ఆధార్ కార్డు నెంబర్, వివరాలను ఎంటర్ చేస్తే పది రోజుల్లో పాన్కార్డు ఇంటికి వస్తుంది. ఆధార్ కార్డుకు కేవైసీ ఉంటే గంటలోనే ఈ-మెయిల్కు పాన్కార్డు కాపీ వస్తుంది. ఇందుకుగానూ కేవలం రూ.107ను యూపీఐ, బ్యాంక్ ద్వారా చెల్లించాలి. దీనిపై అవగాహన లేకపోవడంతో ప్రజల నుంచి మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు రూ. 150 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు….? ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://tela nganaepass.cgg.gov.in/KalyanaLakshmiLinks.do వెబ్సైట్లో ఎ లాంటి రుసుము లేకుండా సేవలు పొం దొచ్చు. దరఖాస్తు ఫారం, అప్లోడ్ చేసి న వాటికి సంబంధించిన జీరాక్స్ ప్రతులను తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. చాలా మందికి అవగాహన లే క ఇంటర్నెట్ కేంద్రాల్లో అధిక డబ్బులు చెల్లిస్తున్నారు. దీనికితోడు దళారులు రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు వ సూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి. అలా చేస్తే ఆధార్ కార్డును https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్ నుంచి స్మార్ట్ఫోన్లో ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రూ.50 రుసుం చెల్లిస్తే నెలలోగా పీవీవీ కార్డు ఇంటికి వస్తుంది.సామాన్యులకు సైతం సులభంగా రెవెన్యూ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ధరణి సేవలను మరింత మెరుగుపర్చింది.
https://dharani.telangana.gov.in/ agricultureHomepage?lang=en వెబ్సైట్లో భూ వివరాలను ఉచితంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సిటిజన్ లాగిన్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ధరణి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ధరణి వెబ్సైట్లో లాగిన్ అయ్యాక భూ క్రయవిక్రయాల వివరాలను పొందుపరిచి, సర్వీస్ ట్యాక్స్ ను యూపీఐ లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా చె ల్లించాలి. స్లాట్ బుక్ చేసుకున్న తేదీన తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.