భూత్పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి లతో కలిసి ఆయన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాటికొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1లక్షా,50వేల వ్యయంతోనిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు.
146మందికి కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్దిని సాధించిందని , సాగునీటి సౌకర్యంతో ఎంతో మెరుగుపడిందని ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు జిల్లాపై ఎంతో మమకారం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ కదిరెశేఖర్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, వైస్ ఎంపీపీ నరేష్గౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, సర్పంచులు నీలిమ, సాయికుమార్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు రజిత, సాయిలు, వెంకటేశ్వరమ్మ, కో ఆప్షన్లు ఖాజ, అజీజ్, జాకీర్, నాయకులు సత్యనారాయణ, సాయిలు, మురళీధర్గౌడ్, రామురాథోడ్, గురు, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.