వెల్దండ, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ మన తో ఉన్నంత కాలం కాంగ్రెస్, బీజేపీలకు భయపడే ప్రసక్తే లేదని, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఏవీఆర్ఎస్ గార్డెన్లో మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు భూపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్యాదవ్ మాట్లాడుతూ దేశంలో కేసీఆర్ లాంటి గొప్ప నా యకుడు ఎక్కడా లేరన్నారు. ఆయన కారనజన్ముడని, ప్రజా సేవకే ఆయన జీవితం అంకితమన్నారు. అలాంటి మహానాయకుడు తెలంగాణలో పుట్టడం అదృష్టమన్నారు.
కేసీఆర్ మూచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతులని అభివృద్ధి చేసే వారికే అండగా నిలుస్తారన్నారు. అనంతరం గోళి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్కు కానుక ఇద్దామన్నారు. గడప గడపకు కేసీఆర్ పథకాలు చేరాయని, ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసునన్నారు. జైపాల్యాదవ్ను గెలిపిస్తే కల్వకుర్తి మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.
అనంతరం మండలంలోని కుప్పగండ్లకు చెందిన టీడీపీ నాయకుడు బాలకిష్టయ్య, మాజీవార్డు సభ్యుడు నారయ్యతో పాటు 50 మంది విండో డైరెక్టర్ శేఖర్ ఆధ్వర్యం లో, బొల్లంపల్లికి చెందిన 50 మంది కాం గ్రెస్ కార్యకర్తలు తిర్మల్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు వెల్దండలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ చైర్మన్ విజయ్గౌడ్, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ విజితారెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్రావు, సింగిల్విండో డైరెక్టర్ శేఖర్, నాగు లు, సర్పంచులు వెంకటేశ్వర్రావు, గోరటి శ్రీను, కుమార్, రామకృష్ణ, అంజయ్య, అంజీనాయక్, శ్రీనునాయక్, వెంకటేశ్, తిర్మల్రావు, జైపాల్నాయక్, వెంకటయ్యగౌడ్, గోపాల్నాయక్, ఎంపీటీసీలు రా ములు, గుత్తి వెంకటయ్య, జూపల్లి బాలస్వామి కార్యకర్తలు ఉన్నారు.
కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్లో నియోజకవర్గసాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్గౌడ్, మధు, శ్రీకాం త్, మనోహర్రెడ్డి, నగేశ్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.