ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలోని వెంచర్ల యజమానులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల కోసం హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ను సంప్రదించారు. ఆయన ట్రాన్స్కో ఏఈ సురేశ్ను కలిసి విషయం చెప్పగా.. 100 కేడబ్ల్యూ ట్రాన్స్ఫార్మర్లను ప్రతిపాదించేందుకు ఐదు వెంచర్లకుగానూ రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ప్రభాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.పథకం ప్రకారం ముందుగా రూ.లక్ష ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకొని శుక్రవారం నగదు అందజేశాడు. కారులో డబ్బుతో వెళ్తున్న ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 29 : కల్వకుర్తి పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏ సీబీ అధికారులకు చిక్కిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్నది. పాలమూరు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వివరాలను వెల్లడించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్, శ్రీనివాసులు ప్లాటినం, ప్రైమ్ అనే రెండు వెంచర్లలో ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్కు చెందిన ప్రభాకర్ అనే కాంట్రాక్టర్ను సంప్రదించారు. కాగా, ప్రభాకర్ కల్వకుర్తి విద్యుత్ కార్యాలయంలో ఏ ఈ సురేశ్ను కలిశాడు. వెం చర్లలో 100 కేడబ్ల్యూ డీటీఆర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉండగా.. ఏఈ సురేశ్ ఒక్కో వెంచర్ నుంచి యాభై వేల చొప్పున రూ.లక్ష డిమాండ్ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ప్ర భాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కారులో ఏఈ సురేశ్కు ప్రభాకర్ రూ.లక్ష ఇచ్చాడు. ఆడ బ్బును కారులో తీసుకెళ్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వా ధీనం చేసుకున్నారు. ఏఈని విచారించిన అనంతరం హైదరాబాద్ స్పెషల్ కోర్టు (నాంపల్లి)లో శనివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ నర్సింహ, లింగస్వామి, సిబ్బంది ఉన్నారు.