గద్వాల, మార్చి 13 : గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. త స్మయ్.. శ్రీగురవే నమః అనే మాటలకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉన్నది. అయితే కొందరు గురువుల వల్ల ఆ మాటలకు సమాజంలో అర్థం లేకుండా పోతున్నది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుల విద్యాబో ధన ద్వారా వారు బావిభారత పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విద్యార్థులను తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతుంటే వారిని చూసిన విద్యార్థులు ఏం నేర్చుకుంటారు.. వారు అదే బాటలో పయనించడం షరా మామూలే.
అయితే, పా ఠశాలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు అందరూ మన కూ తురు లేదా కుమారుడు, చెల్లి, తమ్ముడు వయస్సు ఉన్నవారే ఉంటారు. అయితే అటువంటి అభం శుభం తెలియని విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే వారిని లైంగికంగా వేధిస్తే ఆ చిన్నారులు ఆ విషయాన్ని అటు తల్లిదండ్రులకు, ఇటు మిత్రులకు చెప్పులేక లోలోన మదన పడుతున్నారు. ఒక వేల తల్లిదండ్రులకు చెబితే పాఠశాల మార్పిస్తారనే భయం ఓ వైపు.. గురువులు ఏం శిక్ష విధిస్తారో అనే బాధ మరో వైపు ఉంటూ కామ పిశాచాల లాంటి దారితప్పుతున్న గురువుల మధ్య వారు పెట్టే చిత్రహింసలను భరిస్తున్నారు.
ఈ విషయాలు విద్యాశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో గురువులు తమ మానసిక ఆనందం కోసం బిడ్డలలాంటి చిన్నారుల పట్ల మృగాలుగా ప్రవరిస్తూ కొంతమంది ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. జిల్లాలో కొందరి ఉపాధ్యాయుల తీరు వల్ల విద్యావ్యవస్థ నాశనమయ్యే పరిస్థితి నెలకొన్నది. అలాంటి పరిస్థితి జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకోవడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు వెనుకడుగు వేసే పరిస్థితి దాపురించింది. ఈ కారణంగా చాలా మంది అమ్మాయిలను మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. ఈ పాపం ఎవరిది అంటే ముమ్మాటికి ఉపాధ్యాయులదేనని చెప్పొచ్చు.
ఉపాధ్యాయులంటే విద్యార్థులకు విద్యాబుద్ధ్దు లు నేర్పించి వారిని సరైన మార్గంలో నడిపించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బా ధ్యత ఉంది. కానీ కొంత మంది ఉపాధ్యాయులు వారి మానసిక ఆనందం కోసం దారి తప్పుతున్నారు. మూడు రోజుల కిందట మల్దకల్ మం డలం విఠలాపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉ పాధ్యాయుడు అక్కడి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుంటే ఈ విషయం అక్కడి పెద్దసార్కు చె ప్పారు.
అయినా ఆయన ఏమీ పట్టించుకోక పోవడంతో ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. ఇది భరించలేని విద్యార్థులు బాలల సంరక్షణకు కమిటీకి ఫిర్యాదు చేశారు. వారు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో వెకిలి చేష్టలు చేయడ మే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వారికి చెప్పడంతో బాలరక్షణ సిబ్బంది కంగుతిన్నారు. ఇలాంటి విషయాలు ఆయనకు నిత్యకృత్యమని విద్యార్థినులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన బాలరక్షణ సిబ్బంది ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి వెళ్లడంతో సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న మోదు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చే శారు. అయితే విద్యార్థినుల పట్ల మానవమృగాలుగా వ్యవహరిస్తున్నా కొంతమంది ఉపాధ్యాయులకు కొన్ని సంఘాలు వారిని కాపాడే ప్రయ త్నం చేయడంలో భాగంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజకీయ నాయకుల నుంచి విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
ఆరు మాసాల కిందట గద్వాల మండలం అ నంతపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తే గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఇతడిపై కేసు నమోదు కాగా జైలుకు వెళ్లాడు. గతేడాది మల్దకల్ మండల కేంద్రంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని మానసికంగా, లైంగికంగా వేధించడంతో అ తడికి గ్రామస్తులు బుద్ధి చెప్పి విద్యార్థిని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పించారు.
ఇలా జిల్లాలో ఏడాదిలో ముగ్గురు గురువులు విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసుల్లో ఊచలు లెక్క పెడుతున్నా ఇంకా కొంత మంది ఉపాధ్యాయుల్లో మా త్రం మార్పురావడం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారికి కఠిన శిక్షలు అమలు చేసి వి ద్యా, ఉపాధ్యాయ వ్యవస్థకు కళంకం రాకుండా చూడాలని మేధావులు కోరుతున్నారు.