గూడు లేని పేదలకు ఇల్లు కేటాయించాలన్న సదుద్దేశంతో జనంలోకి జననేత అడుగులు వేశాడు.
ఎండలోనూ ఇంటింటికీ తిరుగుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హుల ఎంపికకు సర్వే
చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా ఇండ్లకు వస్తుండడం.. లబ్ధిదారులను ఎంపిక చేస్తుండడంతో వారి
ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతనెవరో కాదు.. తెలంగాణ ఉద్యమంలో తన పదవిని
తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన జన నేత.. మన ఎమ్మెల్యే లక్ష్మన్న. జడ్చర్ల పట్టణంలో నిత్యం గడప గడపకూ వెళ్లి అర్హుల గురించి ఆరా తీస్తున్నారు. పైరవీకారుల ప్రమేయం లేకుండా.. పారదర్శకంగా ఇండ్లను అందించేందుకు వార్డుల బాట పట్టాడు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల వెంట పర్యటిస్తున్న ఆయన నిబద్ధతకు పట్టణ ప్రజలు సైతం జై కొడుతున్నారు.
మహబూబ్నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదోడి సొం తింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చే స్తున్నారు. పేదలు అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో ఉం డొద్దనే ఉద్దేశంతో రెండు పడకల గదులకు ప్రాధాన్య త ఇస్తున్నారు. ప్రభుత్వ జాగాల్లో ఇండిపెండెంట్, జీప్లస్-3ల్లో ఇండ్లు కట్టించి ఉచితంగా అందజేస్తు న్నది. ఈ స్కీం లబ్ధిదారుల పాలిట వరంగా మారిం ది. డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయా లనే లక్ష్యంతో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వయంగా ఇంటింటి సర్వే చేపడుతున్నారు. దళారుల బెడద లే కుండా నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని.. మండుటెండలను సైతం లెక్క చేయకుండా వార్డుల పర్యటన చేపడుతున్నారు. ఎమ్మెల్యేనే స్వయంగా తమ ఇంటికి వచ్చి ఇండ్లు కేటాయిస్తుండడంతో లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
తెలంగాణ ఉద్యమం స మయంలో పదవికి రాజీనామా చేసి.. స్వరాష్ట్రంలోని తొలి కేబినెట్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా లక్ష్మా రెడ్డి బాధ్యతలు ఎన్నో వినూత్న పథకాలతో ప్రజల మనసుల్లో నిలిచారు. జడ్చర్ల పట్టణం న లుదిక్కులా ఆకాశహర్మ్యాలను తలపించేలా రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. వీటిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం గా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇల్లు కావాలని అడగకున్నా.. పార్టీలకతీతంగా అర్హులను ఎంపిక చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల మద్దతుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష్మారెడ్డి పర్యటన చర్చనీయాంశంగా మారింది. కాగా, జడ్చర్ల పట్టణంలో 1,453, మిగతా మండలాల్లో 556 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఆయా మండలాల్లో కొన్ని ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుట్టలో జీప్లస్-2 పద్ధతిన 560, బోయలకుంట జీప్లస్-2లో 120, కావేరమ్మపేట జీప్లస్-2లో 120, జాతీయ రహదారిని ఆనుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఇండిపెండెంట్గా 500, పెద్దగుట్ట వద్ద ఆలూరు రహదారి సమీపంలో 48, యాసయ్య కుంట రహదారిలో 48, మాధవరావు కంపౌండ్లో 8, పాతబజార్ హరిజనవాడలో 12, రంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ వెనుక జర్నలిస్టులకు 40.. ఇలా మొత్తం 1,453 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. వీటిని ఐటీ, మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. అయితే, అంతకుముందే లబ్ధిదారులను స్వయంగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. నేతలు తమ అనుచరులకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తు న్నా.. నిజమైన పేదలకు ఇవ్వాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు.
వార్డుల పర్యటన వివరాలు ముం దుగానే చెబుతుండడంతో లబ్ధిదారులు నేరుగా ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకుంటున్నారు. మున్సిపాలిటీలో 27 వార్డులున్నాయి. వీటిలో కావేరమ్మపేటలోని రెండు వార్డుల్లో నెల కిందట లబ్ధిదారులను ఎం పిక చేశారు. రెండు వారాలుగా సుమారు 7 వార్డుల పర్యటన ముగించారు. తాసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, వార్డుల ముఖ్యనేతలు, కౌన్సిలర్లను వెంట బెట్టుకొని ఉదయం 7 గంటల నుంచే పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. పూర్తిగా ఇల్లు లేని వారు, కిరాయి ఇంట్లో ఉంటున్న వారి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆధార్ కార్డుపై డబుల్ బెడ్రూం కేటాయిస్తున్నట్లు అక్కడికక్కడే రాసిచ్చి.. అధికారులకు అందజేస్తున్నారు. చిన్నచిన్న ఇండ్లు ఉ న్నవారు, జాగా ఉన్నోళ్లకు గృహలక్ష్మి పథకం కింద ఓపెన్ ప్లాట్ అని మార్క్ చేస్తున్నారు. అయితే, పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల ఇండ్లకు కూడా వెళ్లి విచారణ చేస్తున్నారు.
నిజమైన అర్హులు ఉంటే లబ్ధిదా రుల్లో చేర్చుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల కా ర్యకర్తలు, నాయకులు డైలమాలో పడ్డారు. ఇ ప్పటివరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇలా వచ్చి ఇల్లు కావాలా అని అడగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ.25 వేలు మంజూరయ్యే ఇందిరమ్మ ఇం టికే రూ.10 వేలు లంచం ఇచ్చామని.. అలాంటిది ప్రస్తుతం లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఆనందంలో మునిగి తేలుతున్నారు. నాలుగు రోజుల కిందట టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో సహించలేక చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తున్నారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు అబద్ధాలని స్పష్టం గా తేలుతుండడం.. డబుల్ బెడ్రూం ఇండ్లను పా రదర్శకంగా కేటాయిస్తుండడంతో ప్రతిపక్షాల నేతలకు చుక్కెదురవుతున్నది. ఒత్తిడి లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి త నదైన ైస్టెల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తూ మిగతా ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను విమర్శలకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలన్న తపనతోనే ముం దుకెళ్తున్నాం. వార్డుల వారీగా పర్యటిస్తూ.. ఇల్లు లేని పేదలను గుర్తించి అక్కడికక్కడే డబుల్ బెడ్రూం ఇం టిని కేటాయిస్తున్నాను. జాగా ఉంటే గృహల క్ష్మి పథకం కింద అర్హులుగా చేర్చుకుంటున్నాను. ఈ ప్రక్రియ అంతా జనం సమక్షంలోనే జరుగుతున్నది. ప్రజల పరిస్థితిని తెలుసుకునే వీలు కలుగుతుంది. నిజమైన లబ్ధిదారులకు ఇచ్చామనే తృప్తి మిగులుతుం ది. సీఎం కేసీఆర్ విజన్ వల్లే డబు ల్ బెడ్రూం ఇండ్ల కల సాకా రం అవుతున్నది.
– సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే
పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి పర్యటన చేపట్టడం అభినందనీయం. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల పరిస్థితి తెలుసుకుంటున్నారు. దరఖాస్తులను చూసి ఇండ్లు కేటాయిస్తే.. నిజమైన లబ్ధిదారులను అన్యాయం జరుగుతుంది. ఇలా ప్రజల సమక్షంలో ఎంపిక చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు. ఆర్థిక స్థోమత, వారుచేసే పనులను తెలుసుకొని అవసరమైన వారిని గుర్తించి ఇండ్లు ఇవ్వడం రాష్ట్రంలోనే అరుదు. అలాంటిది జడ్చర్లలో జరగడం ఆనందంగా ఉన్నది. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం మా అదృష్టం.
– దామోదర్, శాంతినగర్, 17వ వార్డు, జడ్చర్ల
ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఎంపిక చేయడం శుభపరిణామం. ఇలా చేయ డం వల్ల ప్రజల పరిస్థితులన్నీ తెలుస్తా యి. ఎమ్మెల్యేనే స్వయంగా తమ ఇంటికివచ్చి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని అర్హులను గుర్తించడం మా అదృష్టం. ఒక్క పైసా లేకుండా గొప్ప మనస్సుతో ఇల్లు కేటాయించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇలాంటి వారు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండాలి. సీఎం కేసీఆర్ హయాంలోనే ఎంతో అభివృద్ధి జరుగుతున్నది.
– మమత, వీరశివాజీనగర్, 16వ వార్డు, జడ్చర్ల