గద్వాల రూరల్, ఫిబ్రవరి 27 : నడిగడ్డ ఇలవేల్పు అయిన జములమ్మ క్షేత్రం జనసంద్రమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులుదీరడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. అమ్మవారిని మెట్టినింటికి తీసుకొచ్చిన తర్వాత మొదటి మంగళవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి దాదాపు లక్షమం ది భక్తులు వచ్చినట్లు ఈవో పురేందర్కుమార్ తెలిపారు.
కొందరు మహిళలు ఉపవాసంతో నైవేద్యాలు సమర్పించారు. కాగా భక్తులకు సర్వదర్శనంతోపాటు రెండు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి సన్నిధిలో భక్తులకు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మ ధ్యాహ్నం 12 గంటలకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. రూరల్ ఎస్సై పర్వతాలు సిబ్బందితో కలిసి క్లియర్ చే శారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జానకీరాములు, ఓంప్రకాశ్ కాంబ్లె, అభిలాష్, శంకర్, ఆలయ సిబ్బంది మురళీధర్రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.