నవాబ్పేట, సెప్టెంబర్ 20: పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొండాపూర్కు చెందిన చిన్నారి బాలీశ్వరికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కొండాపూర్కు చెందిన దోరమోని చిన్నబాలయ్య కూతురు బాలీశ్వరి అనారోగ్యంతో బాధ పడుతుండగా పార్టీ మండల నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయనిధి నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు. మంగళవారం ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో బాధిత కుటుంబసభ్యులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ బొజ్జమ్మ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాఘవేందర్రెడ్డి, బాల్రాజు, యాదయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీసీఎస్ మాజీ వైస్చైర్మన్కు పరామర్శ
మండలంలోని నసరుల్లాబాద్కు చెందిన పీఏసీసీఎస్ బాదేపల్లి మాజీ వైస్చైర్మన్ యాదయ్యయాదవ్ను మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. యాదయ్య కొన్నిరోజులుగా డెంగీతో హైదరాబాద్లోని కీమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే దవాఖానకు వెళ్లి యాదయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యాదయ్యకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే వెంట సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, ఉపసర్పంచ్ నరేందర్, వెంకటేశ్, రామాంజనేయులు, శేఖర్యాదవ్, నరేశ్యాదవ్, కుమార్, పరుశరాం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సన్మానం
గిరిజనబంధు, ఆదివాసీ, గిరిజనుల భవనాలు, పదిశాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మంగళవారం పార్టీ మం డల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే సృగృహంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు తిరుపతినాయక్, గోపీనాయక్, రమేశ్నాయక్, రవినాయక్, బాలునాయక్, ఫీర్యానాయక్, సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్, నాగేందర్నాయక్ పాల్గొన్నారు.