మిడ్జిల్, నవంబర్ 28: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని, పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బచ్చయ్య, నాగరాజు, అశోక్, శివరాజు, రవి మరికొంత మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సుదర్శన్, శంకరయ్య, మాజీ సర్పంచ్ రఫీక్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శేఖర్రెడ్డి, నాయకులు రమేశ్, వినోద్, మల్లేశ్, యాదయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.