మహబూబ్నగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లాలో తొలిసారిగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో శనివారం ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర్శన్ కన్వెన్షన్ వేదికగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు ఈ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఎర్రవల్లి తదితర ప్రాంతాల నుంచి వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లతోపాటు పలునిర్మాణ రంగసంస్థలు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి.
ప్రాపర్టీ షోలో ఇండ్లు, స్థలా లు కొనుగోలు చేసే వారికి రుణాలు అం దించేందుకు అవసరమైన సాయం చే సేందుకు వివిధ బ్యాంకులు సైతం తమస్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీషోకు వచ్చే వారికి ప్రవేశం ఉచితంగా ఉంటుం ది. అలాగే ప్రాపర్టీ షోకు హాజరయ్యే ప్రతిఒక్కరికీ కూపన్లు అందిస్తారు. వారికి నీలోఫర్ నుంచి బహుమతులుంటాయి. ఈ ప్రాపర్టీ షోలో పా ల్గొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆఫర్లు అందించేందుకు సిద్ధమయ్యా యి. ఈ ప్రాపర్టీ షోకోసం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వినియోగదారులు హాజరుకానున్నారు. ఉద యం 10గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈ ప్రాపర్టీ షో కొనసాగుతుంది.
మహబూబ్నగర్ అభివృద్ధి చెందింది
మహబూబ్నగర్ అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఒకప్పుడు మహబూబ్నగర్కు ఇప్పటి పట్టణా నికి ఎంతో తేడా ఉంది. హైదరాబాద్ నగరానికి కేవలం ఒక గంట ప్రయాణ సమయం మాత్రమే కావడంతో ఈ ప్రాంతం స్థిరాస్తి రంగంలో ఊహించని విధంగా వృద్ధి చెందుతోంది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలు ఓ వలయం గా మారి దాదాపుగా కలిసిపోయాయి. దీంతో ఈ మూడు పట్టణాల పరిధిలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు ఏవైనా సరే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నా యి. మాసంస్థ దేవాస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ బైపాస్లో నూతన కలెక్టరేట్కు సమీపంలోనే 2ఎకరాల్లో, జడ్చర్ల పట్టణంలో 3ఎకరాల్లో సక ల సదుపాయాలతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాం. అ లాగే జడ్చర్ల పట్టణంలో డీటీసీపీ అనుమతితో 6ఎకరాల్లో విల్లాలు కూడా నిర్మిస్తున్నాం. న మస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోలో మేము కూడా పాల్గొంటున్నాం.
– ఎన్ సూర్యనారాయణరెడ్డి, ఎండీ, దేవాస్ ఇన్ఫ్రా