అచ్చంపేట, మార్చి 19: అమ్రాబాద్ అంటేనే దాడులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాల సంస్కృతికి నిలయంగా మార్చడం మంచి పద్ధతి కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే మంచిదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని క్యాంపు కార్యాలయంలో విప్ గువ్వల మాట్లాడారు. అమ్రాబాద్కు ఎప్పు డు వెళ్లినా జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ దాడులకు పురిగొల్పడం మంచిది కాదని, ఇప్పటికైనా పద్ధతి మా ర్చుకొని వ్యవహరించాలని, లేదంటే ప్రతిదాడులకు పాల్పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమ్రాబాద్లో ఏండ్లుగా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, దాడులు, భయబ్రాంతులకు గురిచేయడంపై డీజీపీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి మంచి అధికారిగా పనిచేస్తుంటే రెడ్డి వర్గానికి చెందిన అధికారి నా మండలంలో ఎలా పనిచేస్తాడని పోలీసులను కూడా భయభ్రాంతులకు గురిచేయడం వంశీకృష్ణ వ్యవహారశైలికి నిదర్శనమన్నారు. ఎన్నికల సందర్భంగా వెళ్లినప్పుడు బీకే లక్ష్మాపూర్లో తన కారు అద్దాలు పగులగొట్టి చంపాలని కుట్ర చేశాడని, దేవుడి దయవల్ల బతికి బయటపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.
వంశీకృష్ణ సొంత గ్రామం వెలుమపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన తీరు నచ్చక బీఆర్ఎస్లో చేరడానికి సమావేశం నిర్వహించుకుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ జెండాలు చించడం, పోటీగా వారి జెండాలను కట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఆ గ్రామానికి వెళ్లిన తనను పార్టీ చేరికలయ్యాక తిరిగొస్తుండగా కాంగ్రెస్ వర్గీయులు మద్యం మత్తులో అడ్డుకొని వాహనంపై దాడులు చేసే ప్రయత్నం దేనికి సంకేతమన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా మూడోసారి అచ్చంపేట గడ్డపై గువ్వల బాలరాజు జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ రాంబాబు, మాజీ చైర్మన్ తులసీరాం, రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, పర్వతాలు, అమినొద్దీన్, రాజేశ్వర్రెడ్డి, రమేశ్రావు, అంతటి శివ, శ్రీను, సతీశ్, లోక్యా నాయక్, జగపతి తదితరులు పాల్గొన్నారు.