నారాయణపేట, డిసెంబర్ 12 : త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను స ర్పంచులుగా గెలిపించుకునే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రాజేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, పేట మండలాలతో పా టు పట్టణం నుంచి వచ్చిన ముఖ్య నా యకులు, కార్యకర్తలతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలు పో టములు సహజమన్నారు. పదేండ్లుగా అధికారంలో ఉన్నాం, ఈ సారి ప్రజ లు మార్పు కోరుకున్నారన్నారు. ఎన్నికల్లో కొంత మంది తన వెనకాల ఉండి తనకు మోసం చేశారని, ఇది కూడా ఓ టమికి ఒక కారణమన్నారు. ఓటమి చెందినంత మాత్రాన కార్యకర్తలు ఎవ రూ అధైర్యపడొద్దన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలో ఏ పార్టీకి లేనంతగా 47,200మంది కార్యకర్తల సభ్యత్వ బలం బీఆర్ఎస్కు ఉందన్నారు. రాబో యే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇ ప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తానని, నెలలో రెండుసార్లు సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీని మరింత పటిష్ట ప రుస్తానన్నారు. గెలిచిన ఎమ్మెల్యే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన తరఫు న, పార్టీ కార్యకర్తల తరఫున పూర్తి స హాయ సహకారాలు ఉం టాయన్నా రు. అదే సమయంలో ని యోజకవర్గ ప్రజలు , రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్ర జా క్షేత్రంలో ఎప్పటికప్పు డు నిలదీస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నా రు. కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.