గద్వాల, ఫిబ్రవరి 4 : వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించి ఐదేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు ఢోకా లేకుండా సాగు చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్ కోసం రైతులు ఎదురుచూసే రోజుల నుంచి.. నేడు పవర్ఫుల్గా విద్యుత్ అందుతున్నది. వం తులు వారీగా ఇచ్చే కరెంట్ కూడా ఎప్పుడు వ స్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. పంటలను కాపాడుకునేందుకు మోటా ర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రాత్రి, పగలు తేడా లేకుం డా పడిగాపులు గాసేవారు. ఒక్కోసారి రైతులు వి ద్యుత్ ప్రమాదాలకు గురై మరణించేవారు.
రాత్రివేళ పొలాలకు నీరు పారించేందుకు వెళ్లి విషపురుగుల బారిన పడిన సంఘటనలు కోకొల్లలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కష్టాలు తప్పవని.., ప్రజలు వైర్లపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని ప్రతిపక్షాలు హేళన చేసిన తీరును స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. 2018 జనవరి 1 నుంచి రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. దీంతో రైతులు రాత్రి వేళల్లో పొలాలకు నీరు పెట్టే బాధలుతీరాయి. ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి నీరు పారించొచ్చు. దీంతో రైతుల విద్యుత్ మరణాలు తగ్గిపోయాయి. నిరంతర విద్యుత్ను అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చే శారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇందుకోసం రూ.60కోట్లకు పైగా ఖర్చు చేశారు.
జిల్లా ప్రజలు వినియోగించే విద్యుత్లో 75 శాతం వ్యవసాయానికే వాడుతున్నట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తున్నది. జిల్లాలో 15,319 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. అందులో 11,200 వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. గతేడాది యా సంగి సీజన్లో వ్యవసాయానికి ప్రతిరోజూ 32 లక్షల యూ నిట్లు వాడినట్లు అధికారులు తెలిపారు. వానకాలంలో 15 లక్షల నుంచి 20 లక్షల యూనిట్లు వినియోగించారు. రా ష్ట్రం ఏర్పడకముందు జిల్లాలో 34 సబ్స్టేషన్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 60కి చేరుకున్నాయి. రైతులకు లో ఓ ల్టేజీ సమస్య తీర్చేందుకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వెయ్యి ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందజేశారు.
నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో జిల్లా నుంచి ఏడాదికి సుమారు రూ.300కోట్లకు పైగా విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. నీరు పుష్కలంగా ఉండడంతో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు వ్యవసాయానికి 181.69 మిలియన్ యూనిట్లు వినియోగించారు. 2018-19లో 432 మి.యూ, 2019-20లో 499.68 మి.యూ, 2020-21లో 528.98 మి.యూ, 2021-22లో 880 మి.యూ. వాడుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో రైతులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రాష్ట్రం ఏర్పడకముందు పంటలకు నీరు పారించేందుకు కరెంట్ కోసం ఎదురుచూసేవాళ్లం. ఏడెనిమిది గంటలు కూడా ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంతర ఉచితవిద్యుత్ అందించి తమ కష్టాలు తీర్చారు. రైతుల పాలిట ముఖ్యమంత్రి దేవుడు. రాత్రి పూట ప్రశాంతగా నిద్రపోతూ.. పగలు మాత్రమే పంటలకు నీరు పారించుకుంటున్నాం.
– వంశీకృష్ణ,కొత్తపల్లి, గద్వాల