నారాయణపేట, మే 23: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండడంతో పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు లో ఉంటుందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని, కేంద్రాలకు 100మీటర్ల దూ రం వరకు ప్రజలు ఎవరూ గుమిగూడరాదన్నా రు. పరీక్ష సమయంలో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అడిషనల్ డీజీపీ(ట్రైనింగ్) అభిలా ష్ బిస్త్ నూతన పోలీస్ చట్టాలు, కొత్త క్రిమినల్ చట్టాలపై వీసీశిక్షణ కార్యక్రమంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్ పాల్గొన్నారు.
నారాయణపేటరూర ల్, మే 23: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో నారాయణపేట జి ల్లాలో పది కేంద్రాలు ఏ ర్పాటు చేసినట్లు పరీక్షల కన్వీనర్ సుదర్శన్రావు తెలిపారు. జూన్ 1 వ రకు పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉద యం 9గంటల నుంచి 12వరకు ప్రథమ సంవత్స రం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30నిమిషాల వరకు రెండో ఏడాది పరీక్షలు నిర్వహించనున్నామని, 10మంది సీఎస్లు,10 మంది డీవోలతో పాటు 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించామన్నారు. అలాగే ఒక కస్టోడియన్ను, ఒక ఫ్లయింగ్, ఒక సిట్టింగ్ స్కాడ్ ను నియమించామన్నారు. నేడు 2,475 మంది జనరల్, 153 ఒకేషనల్ ప్రథమ సంవత్సరం, 1,604 మంది జనరల్, 96మంది ద్వితీయ పరీక్షకు హాజరుకానున్నారన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో 21 కేంద్రాలు : పాలమూరు, మే23: నేటి నుంచి జూన్ 1వ తే దీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణ బోర్డు నిబంధనల మేరకు పకడ్బందీగా ఉండాలని జిల్లా మాధ్యమిక అధికారి డా.శ్రీధర్సుమన్ ఆదేశించారు. గురువారం ఇంటర్మీడియట్ కా ర్యాలయంలో స్వాడ్, కస్టోడియన్ల బృందాలకు ప రీక్షల నిర్వహణపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి ల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం 6,585మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 3,719మంది విద్యార్థులు మొత్తం 10,304 మం ది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30గంటల నుంచి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం పరీ క్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పర్చడాన్ని పరిశీలించాలని చెప్పారు. సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను ఉదయం 7గంటల నుంచి అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీఈసీ సభ్యులు ఉమామహేశ్వర్, రవీందర్, స్వాడ్ బృందాలు, కార్యాలయ సిబ్బంది, సందీప్, సాధిక్, అలీ తదితరులు పాల్గొన్నారు.