కల్వకుర్తి, ఏప్రిల్ 20 : కల్వకుర్తి పట్టణంలోని లక్ష్మీవెంకటనర్సింహ స్వామి పారా బాయిల్డ్ రైస్మిల్లులో శనివారం హైదరాబాద్ సివిల్ సప్లయ్ అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. మిల్లులో వడ్ల బస్తాలను లెక్కించారు. సీఎంఆర్కు సంబంధించిన 2,86,694 వడ్ల బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.23.3కోట్లు గా అధికారులు చెప్పారు. బియ్యంగా మార్చి ఇవ్వమని ప్రభుత్వం ఇచ్చిన వడ్లను చాలా మంది రైస్మిల్లుల వ్యాపారులు వడ్లను చీకటి మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. టార్గెట్ ప్రకారం రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని సివిల్ సైప్లె శాఖకు అప్పగించకుండా కాలాయాపన చేస్తుండటంతో వడ్లను బ్లాక్ మార్కెట్కు తరలించారనే ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది. దీంతో సివిల్ సైప్లయ్ టాస్క్ఫోర్స్ అధికారుల బృందం అ నుమానం వచ్చిన మిల్లులలో తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో టాస్క్ఫోర్స్ అధికారులు లక్ష్మీ వెంకట నర్సింహ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లులో సీఎంఆర్ వడ్ల బస్తాలు మాయమయ్యాయని నిర్ధారించిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.
రైస్మిల్లు యజమాని రిమాండ్
పాన్గల్, ఏప్రిల్ 20 : మండలంలోని మాందాపూర్కు చెందిన పుచ్చల పరమేశ్వర్రెడ్డికి అతడి కు టుంబ సభ్యుల పేరిట వనపర్తి జిల్లాలో నాలుగు రైస్మిల్లులు ఉన్నాయి. మాందాపూర్లో కోడలు అనూషరెడ్డి ఇషాన్ అగ్రోటెక్ మిల్లులో సివిల్ సప్లయ్ కార్పొరేషన్తో కస్టమ్స్ మిల్లింగ్ రైస్ గు రించి ఒప్పందం చేసుకొని బియ్యాన్ని తిరిగి వారికి ఇవ్వకుండా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వారిని, ప్రభుత్వాన్ని మోసం చేసి బహిరంగ మార్కెట్లో రూ.3కోట్ల 25లక్షలకు అమ్ముకొన్నారు. ఈ విషయంలో శనివారం పుచ్చల పరమేశ్వర్రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వేణు తెలిపారు.
కాగా, పుచ్చల మధుకుమార్రెడ్డి, అనూషరెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు.