నారాయణపేట, జనవరి 24 : నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, ధన్వాడ, మరికల్లో రూ.196 కోట్ల వ్య యంతో చేపట్టిన, చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మం గళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన హోం శాఖ మంత్రి మహమూ ద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
పర్యటన సాగిందిలా..
హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా నారాయణపేట మండలం సింగారం గ్రామ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ది గారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ కార్యాలయా న్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భీమండి కాలనీ సమీపంలో రూ.62.10 కోట్లతో నిర్మించను న్న సమీకృత కలెక్టరేట్కు, వల్లంపల్లి రోడ్డులో రూ.38.50 కో ట్లతో నిర్మించనున్న జిల్లా పోలీస్ కాంప్లెక్స్కు, యాద్గిర్ రో డ్డులో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న మాడరైజేషన్ ల్యాండ్రీ (దోబీఘాట్)కి, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సేవాలాల్ భవనానికి, నారాయణపేట మండలం అప్పక్పల్లి నుంచి కోయిల్కొండ వరకు రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డబుల్రోడ్డుకు, అప్పక్పల్లి సమీపంలో రూ.2.90 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్ కు, ధన్వాడ మండల కేంద్రంలో రూ.2.90 కోట్లతో నిర్మించనున్న పోలీస్స్టేషన్కు, మరికల్ మండల కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మించనున్న మండల కాంప్లెక్స్ నిర్మాణాలకు సం బంధించి ఒకే వేదిక వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను మంత్రులు ప్రారంభించారు. కొత్త బస్టాండ్ వద్ద రూ.6 కోట్ల తో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను ప్రారంభించారు. సక ల హంగులతో తక్కువ వ్యవధిలో మార్కెట్ నిర్మించడంతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
యాద్గిర్ రోడ్డులోని ఎర్రగుట్ట వద్ద రూ.47 లక్షలతో చేపట్టిన సఖి సెంటర్ను ప్రారంభించారు. అనంతరం రూ.4 కోట్లతో కొండారెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మినీట్యాంక్ బం డ్ను ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి ఎస్పీ కా ర్యాలయం సమీపంలో రూ.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ పార్క్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, పేట జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే లు చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయ ణ భట్టడ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.