బల్మూరు, ఏప్రిల్ 25 : పిచ్చికుక్కలు స్వైరవీహారం చేస్తూ ఎనిమిది మందిపై దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం పిచ్చికుక్కలు రోడ్డు వెళ్తున్న వారిపై దాడి చేయడంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో 8మందికి పైగా పిచ్చికుక్కలు దాడి చేసినట్లు వారు తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్లను వేయించారు. గ్రామంలో ధర్మతేజ, సాయి, పవన్కుమార్, బాలయ్య, మణికంఠ, శివకుమార్, నాగమణి అలాగే కొండనాగుల గ్రామంలో ఒకరిపై పిచ్చికుక్క దాడి చేసినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పిచ్చికుక్కల నుంచి గ్రామస్తుల నుంచి కాపాడాలని క్షతగాత్రుల బంధువులు కోరుతున్నారు.
కోనేరు గ్రామంలో పలువురు..

Mm
అలంపూర్, ఏప్రిల్ 25 : పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులు గాయాల పాలైన ఘటన అలంపూర్ మండలంలోని కోనేరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన తిమ్ములమ్మ, స్వాములు దంపతులకు ఆరేండ్ల జీవన్ బాబు, నాలుగేండ్ల కూతురు మధు కుమారి ఉన్నారు. వీరు పిచ్చి కుక్క కాటుకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కర్నూలు దవాఖానకు 108లో తరలించినట్లు ఈఎంటీ రాజా రత్నం, పైలట్ శ్రీశైలం తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా అధికారులు చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.