ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ దాగుంటుందని దానిని గుర్తించి ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. మహబూబ్నగర్ క్రిస్టియన్పల్లిలోని ఫాతిమా హైస్కూల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ను మంత్రి ప్రారంభించి ప్రదర్శనలను తిలకించారు. 240పాఠశాలల నుంచి 342 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో పాల్గొన్నారు. అనంతరం మంత్రి జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు.
– పాలమూరు/మెట్టుగడ్డ, నవంబర్ 28
పాలమూరు, నవంబర్ 28 : విద్యార్థులో దాగి ఉన్న ప్రతిభన వెలికితీయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి వద్ద ఉ న్న ఫాతిమా హైస్కూలో విద్యాశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం మం త్రి ప్రారంభించారు. భారత అణుపితామహుడు హోమి జహంగీర్బాబా చిత్రపటానికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వల న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ దాగి ఉం టుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్ది.., భవిష్యత్లో ఏం కావాలో వారే నిర్ణయిస్తున్నారన్నా రు.
మార్కులు తప్పా పిల్లల ఆకాంక్షను పట్టించుకోవడం లేదన్నారు. కేవలం చ దువే కాకుండా సభ్యత, సంస్కారాన్ని నేర్పించాలన్నారు. డిగ్రీవరకు పిల్లల చ దువుపైనే దృష్టి సారించాలన్నారు. తాను ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ చదివే రోజు ల్లో రెకుల షెడ్ ఉండేదని, ఇప్పుడు ప్ర భుత్వం చదువుకునేందుకు అనేక అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. కష్టపడి చదివి అత్యుత్తమ స్థాయికి చేరుకోవాల ని ఆకాంక్షించారు. చంద్రుడిపైకి వెళ్లే స్థా యికి శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిందన్నారు.
రూ.5 లక్షలతో పేదలకు భా రంగా మారిన స్టంట్ ధరను.. నిమ్స్ శా స్త్రవేత్తలతో కలిసి కేవలం రూ.30 వేలకే అందించేలా అభివృద్ధి చేసిన అబ్దుల్కలాం నేటి శాస్త్రవేత్తలకు ఆదర్శమని అ న్నారు. 240 పాఠశాలల నుంచి పా ల్గొన్న 342 మంది విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డిడీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, సీసీకుంట జెడ్పీటీసీ రాజేశ్వరి, డీఈవో రవీందర్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, వెంకటయ్య, కౌన్సిలర్ రాజురాణి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమ ప్రభుత్వం
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 28 : పేదలకు ని రంతరం అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను దరిచేరుస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపా రు. జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ సెంటర్ను సోమవారం మంత్రి ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. రాష్ట్రంలో వి డుతల వారీగా ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టిఫ్పా స్కానింగ్ కోసం ప్రైవేట్ దవాఖానాల్లో రూ.3వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారని, నేడు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా సేవలందిస్తునట్లు తెలిపారు. తెలంగాణకు అండగా ఉండాల్సిన కేంద్రం ఆటంకాలు సృష్టిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డీఎంహెచ్వో శశికాంత్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, సిరాజుద్దీన్, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యంయాదవ్, లక్ష్మి, గైనిక్ విభాగం హెచ్వోడీ రాధ, కౌన్సిలర్లు షబ్బీర్, కిశోర్, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.