నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి నేరస్తుల నోటి నుంచి నిజాలు కక్కించడం వంటి పద్ధతులకు ఫుల్స్టాప్ పెట్టారు. నేటి పోలీసులు వీటికి భిన్నంగా మారారు. ఆధునిక పరిజ్ఞానంతో కేసులను డీల్ చేస్తున్నారు. నేరస్తుల వివరాలు తెలుసుకునేందుకు ఫింగర్ప్రింట్ వినియోగిస్తున్నారు. అనుమానిత ప్రదేశాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జీపీఎస్ సిస్టంతో అధునాతన వాహనాలు అందజేసింది. దీంతో నేరాలు సంఖ్య కూడా తగ్గుముఖం పడుతున్నది. అందుకే ఫ్రెండ్లీ పోలీస్తోపాటు స్మార్ట్ పోలీస్గా పేరు పొందుతున్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 24 : లాఠీ లు చేత బట్టి.. రివాల్వర్ గురిపెట్టి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. నేరాలను అదుపు చేయడం.. నేరస్తుల నోట ని జాలు కక్కించడం.. ఇవన్నీ గతం.. కానీ నేటి పోలీస్ వీటన్నింటికీ భిన్నం.. సాంకేతిక పరిజ్ఞానమే ఆయుధం గా మార్చుకుంటున్నారు. హైటెక్ పోలీసులా వ్యవహరిస్తున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్స్టేషన్లకు పునరుద్ధరించి కొత్త భవనాలు ఏర్పాటు చేశా రు. ఫ్రెండ్లీ పోలీసింగ్తోపాటు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడంతో పర్యవేక్షణ పెరిగి నేరాలు క్రమంగా త గ్గాయి. నేడు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ని ఘా పెరిగింది. 24/7 భద్రతా సేవలకు శ్రీకారం చు ట్టారు. నేరస్తుల వివరాలను క్షణాల్లో తెలుసుకునే వీలున్నది. ఖాకీల్లో జవాబుదారీతనం పెంచేందుకు వాహనాలకు జీపీఎస్ సిస్టాన్ని అమర్చారు. నిందితులను పసిగట్టేందుకు జాగిలాలను సైతం ఏర్పాటు చేశారు. జైల్ రిలీజ్ మేనేజ్మెంట్ సిస్టం (ఏఆర్ఎంఎస్)ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉన్నది.
గతంలో ఏదై నా నేరం జరిగితే వివిధ ప్రాంతాల పోలీస్స్టేషన్లకు వెళ్లి నేరస్తుల సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు.. నేరం జరిగిన వెంటనే నిమిషాల్లో సమాచారం తెలుసుకునే వీలున్నది. ఎవరైనా అనుమానితు లు తారసపడితే పేరు, చిరునామాలను పోలీసుల వద్ద ఉన్న యాప్లో ఎంటర్చేస్తే చాలు వారి వివరాలు మొ త్తం చూపెడుతున్నది. వారికి దేశంలో ఎక్కడైనా గ తంలో ఏదైనా నేరంతో సంబంధం ఉందా..? ఎప్పుడైనా జైల్ రిజిస్టర్, కోర్టులోగానీ కేసు ఉన్నదా..? అనే వివరాలు తెలిసిపోతున్నాయి. జైలులో ఉన్న నేరస్తుల ను కలిసేందుకు వచ్చే వారి వివరాలు, ఫొటోలు కూ డా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత ద్వారా నేరాల పరిశోధన తేలికకానుండగా.. కేసు లు కూడా త్వరగా పరిష్కారం కానున్నాయి.
జిల్లాలోని భద్రతా విషయాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు దేశంలోని నేరస్తుల పూర్తిసమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకంగా కమాండింగ్ కంట్రోల్ సిస్టం ఏ ర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ స్వతంత్రంగా పనిచేస్తుంది. జిల్లాలోని పోలీసులు పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా 30 ట్యాబ్లను అందజేశారు. జిల్లా కేంద్రంలోని హెడ్క్వార్టర్స్లో ప్రత్యేకంగా 26 కంప్యూటర్లు ఏర్పాటు చేసి పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అయితే, సీసీ కెమెరాలను ఒకప్పు డు దాతల సహకారంతో అక్కడక్కడ ఏర్పాటు చేసుకునేవారు. ఎంపీ, ఎమ్మెల్యేలు వీటి కోసం నిధులు కేటాయింస్తుడడంతో విరివిగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెరగడంతో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
ఏదైనా ఘటన జరిగినప్పుడు, ఫిర్యాదు వచ్చినప్పు డు.. సంబంధిత ఏరియా పోలీసులు ఆ ఘటనా స్థలాని కి వెళ్లారా..? లేదా..? అనేది వెంటనే తెలిసిపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. జిల్లాలోని 17 మంది ఎస్సై, ఏడుగురు సీఐ వాహనాలతోపాటు మొత్తం 16 వాహనాలకు జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేశారు. 100 డయల్కు వచ్చే ఫిర్యాదు ఆధారంగా లోకేషన్ చూపిస్తూ ట్రాక్ వస్తుంది. సంబంధిత ఏరియాలోని పోలీసులు ఆ స్థలానికి ఎప్పుడు చేరుకున్నారో తెలిసిపోతుంది.
దీంతో ఘటనాస్థలికి ఎంతమంది సిబ్బందిని పంపించాలి..? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలన్నీ ట్యాబ్ ద్వారానే అందిస్తుంటారు. సంబంధిత పోలీసులతోపాటు ఇతర పోలీస్స్టేషన్లకు కూడా సమాచారం చేరిపోతుం ది. సోషల్ మీడియాపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అసభ్యకరమైన పోస్టింగ్, భద్రతాపరమైన సమస్యలు తీసుకుచ్చేవి, అశ్లీలం, రెచ్చగొట్టేలా ఉన్న పోస్టులను 24 గంటల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోస్టింగ్ చేసిన నెంబర్ ఆధారంగా ఐపీ అడ్రస్ తీసుకొని సంబంధిత నెట్వర్క్ కంపెనీకి తెలియజేసి వాటిని డిలీట్ చేస్తున్నారు.
బాధ్యులను ప ట్టుకొని శిక్షిస్తున్నారు.అలాగే పోలీసుల వద్ద ఉ న్న మొబైల్ ప్రింట్ చెకర్ సాయంతో అనుమానితుల సమాచారాన్ని త్వరగా తెలుసుకునే వీలు ఉంటుంది. అనుమానిత స మయాల్లో, ప్రదేశాల్లో తిరిగే వ్యక్తుల వేలిముద్రలను మొబైల్ప్రింట్ చెకర్పై నమోదుచేసుకుంటున్నారు. ఒకవేళ వారికి గతంలో ఏదైనా నేరాలతో సంబంధాలు ఉంటే వెంటనే వారి సమాచారం తెలిసిపోతుంది. ఈ పరికరం ద్వారా అనుమానితులు నేరస్తులా.. కాదా అనే సమాచారం వెంటనే పసిగట్టొచ్చు.
మహబూబ్నగర్ జిల్లాలో 24/7 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఏ ఘటన జరిగినా.. వెంటనే స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో నేరాలకు సంబంధించిన సమాచారం, నేరస్తుల వివరాలు అందుబాటులో ఉండడంతో పోలీసులు కేసులను వెంటనే ఛేదించే అవకాశం ఏర్పడింది. నేరస్తుల వివరాలు ఒక్కసారి నమోదుచేస్తే శాశ్వతంగా ఉండిపోయేలా రూపకల్పన చేశారు. 100 డయల్కు వచ్చే కాల్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండడంతో పూర్తిస్థాయిలో పరిష్కారమవుతున్నాయి. ఏ నెంబర్ నుంచి 100కు ఫోన్ వచ్చిందో లొకేషన్ తెలిసిపోతున్నది. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఆ ఏరియాలోని పోలీసులకు సమాచారం వస్తుంది. 100 డయల్ ఫిర్యాదులను ఎస్సై లేక ఆ పైస్థాయి పోలీసు అధికారులు కేసులు పరిష్కరించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి సమస్య పరిష్కారమవుతున్నది.
నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతున్నది. ఈ టెక్నాలజీతో ఎలాంటి కేసునైనా త్వరగా పరిష్కరించే వీలు ఉంటుంది. దేశంలోని అన్ని పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో ఒక్కసారి నేరస్తుడిగా నమోదైతే వారి వివరాలు శాశ్వతంగా అందుబాటులో ఉంటాయి. దీని ఆధారంగా చాలా కేసులు త్వరగా పరిష్కారమవుతున్నాయి. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు వాహనాలన్నింటికీ జీపీఎస్ పెట్టాం. ఘటనా స్థలానికి సకాలంలో పోలీసులు వెళ్తున్నారా..? పెట్రోలింగ్ సరిగ్గా చేస్తున్నారా..? అనేది వెంటనే తెలిసిపోతుంది. సాంకేతిక వినియోగంపై పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్నగర్