మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ చెప్పె మాయమాటలను నమ్మి ఓటు వేస్తే ఆగమైతమని దేవరదకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల అన్నారు. శుక్రవారం రాత్రి అడ్డాకులలో ఇంటింటికీ తిరిగి ఆమె స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రాధిక, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
మూసాపేట, నవంబర్ 3 : బీఆర్ఎస్ పాలనతోనే పేద ప్రజల చీకటి జీవితాల్లో వెలుగులు వచ్చినట్లు మాజీ రైతుబంధు మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి అన్నారు. మండలంలోని వేములలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు, ప్రజాసంక్షేమ కోసం సీఎం కేసీఆర్ను అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో రవీందర్గౌడ్, బుగ్గన్న, కృష్ణయ్య, వెంకటయ్య, లడ్డు, మాధవులు, శ్రీనివాస్గౌడ్, కోడి బుర్రన్న పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 3 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ పార్టీ మా జీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్ర చారం నిర్వహించి సీఎం కేసీఆర్ సహకరంతో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పట్టణంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శివనంద్, నాయకులు చంటి, రాము, బాలరాజు, అంజి, ఆశన్న, బద్రీ పాల్గొన్నారు.
నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ పా ర్టీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జామేమసీద్ వద్ద ఉన్న దర్గాలో ప్ర త్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ముస్లిం మతపెద్దలతో మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంలో దేశంలో ఏరాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సోమవారం నిర్వహిం చే సీఎం కేసీఆర్ సభకు పట్టణంలోని ముస్లింలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు సయ్యద్ జక్కి, సయ్యద్ షరిఫ్, మజరోద్దీన్, ఖాజా, ఖదీర్ పాల్గొన్నారు.
భూత్పూర్, నవంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని మండల పరిషత్ అధ్యక్షుడు కదిరె శేఖర్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మండలంలోని వెల్కిచర్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలోని 4, 5వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా వ్యాపార సంస్థల వద్ద, ప్రయాణికుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. అమిస్తాపూర్లో ముడా డైరెక్టర్ సాయిలు, కో ఆప్షన్ సభ్యుడు అజీజ్, కొత్తమొల్గరలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్ ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్గౌడ్, గడ్డంరాములు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 3 : ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు పెద్దమునగల్చేడ్, అడ్డాకుల, కందూరు, పోన్నకల్, శాఖాపూర్ తదితర గ్రామా ల్లో ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లి మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ వాటితో కలిగే లాభాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నా యకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపే ధ్యేయంగా మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్ర చారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం అజ్జకొల్లు, తిర్మలాయపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.