ఖిల్లాఘణపురం, మే 13 : ప్రజలకు మేలు చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని.. నష్టపోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు తనవంతు కృషి చే స్తానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలోని రైతువేదికలో గణపసముద్రం రిజర్వాయర్ ఏర్పాటుతో ముంపునకు గురవుతున్న రైతులతో ఆయన శనివారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ముందుగా బాధిత రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు వస్తుందనే ఆనందం కంటే.. పొలాలు మునిగిపోతున్నాయనే బాధే ఎక్కువ గా ఉందన్నారు.
ఉమ్మడిజిల్లాల్లో ఎన్నో చెరువులు, కుం టలు కూడా సాగునీటితో ముగినిపోయాయని, వారందరికీ వచ్చిన పరిహారం కంటే ఎక్కువ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. గణపసముద్రం 76 ఏండ్ల కిందట కాకతీయరాజులు ఏర్పాటు చేశారని.. ఎంతో ఆలోచనతోనే ఉమ్మడిజిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఖిల్లాలో గు ట్టల మధ్యన ఈ చెరువును వారు ఏర్పాటు చేశారన్నా రు. ఈ చెరువు రిజర్వాయర్గా మారి అలుగుపారితే 58 3 ఎకరాలు నీటిలో మునిగిపోతుందని, రిజర్వాయర్ ఏర్పడితే దానికి అదనంగా 13 ఎకరాల భూమి మాత్ర మే ముంపునకు గురవుతుందన్నారు.
ఈ రిజర్వాయర్ ఏర్పాటుకు రెండు రకాల ప్రణాళికలతో ముందుకు సా గుతున్నామని, మొదటగా రూ.28 కోట్లతో కట్ట, తూము మరమ్మతులు చేస్తామన్నారు. భూ సేకరణకు ప్రభుత్వం మరో రూ.24కోట్లు మంజూరు చేసిందన్నారు. రైతులు భూసేకరణకు సహకరిస్తే రిజర్వాయర్ పనులు చేపడతామని.. లేదంటే కట్ట మరమ్మతు పనులు వేగవంతంగా కొనసాగిస్తామన్నారు. రిజర్వాయర్ నిర్మిస్తే చుట్టుపక్కల ఇండ్లల్లోకి నీరు వస్తుందనే అపోహ వీడాలని.. అందుకు అనుగుణంగా సాంకేతికపరమైన ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. వెయ్యేండ్ల వరకు రైతులకు, జీవరాశులకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రై తుల శాపం తనకొద్దని.. తమ నిర్ణయాన్ని నెలాఖరులో గా తెలియజేయాలన్నారు.
కలెక్టర్తోపాటు పలు శాఖల అధికారులు ఇక్కడికి వస్తారని, వారికి తమ పాస్బుక్ జిరాక్స్ వెనుక రిజర్వాయర్ కావాలా? వద్దా? అనే స మాధానం రాసి ఇవ్వాలని సూచించారు. అప్పుడు రిజర్వాయర్ నిర్మాణంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతవరకు కట్ట, తూము పనులు కొనసాగిస్తామని చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వపరంగా అందరికంటే ఎక్కువ సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని, డబుల్ బెడ్రూం, ప్రభుత్వ భూమి, ప్లాట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాన్నారు. సమావేశంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, మార్కెట్కమిటీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సిం గిల్విండో వైస్చైర్మన్ రాజు, రైతుబంధు సమితి అధ్యక్షు డు వెంకట్రావు, మార్కెట్కమిటీ డైరెక్టర్లు సత్యం, శ్యాం సుందర్రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, మన్నెంగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, ముంపు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వనపర్తికి రూ.14 కోట్లు మంజూరు
వనపర్తి, మే 13 : జిల్లాలో అభివృద్ధి పనులు చే పట్టేందుకు సీఎం కేసీఆర్ రూ.14.70 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి నిరంజన్రెడ్డి శనివారం ప్రకటనలో తె లిపారు. ఖిల్లాఘణపురం మండలంలో రోడ్లు, ప్రహరీ లు, కమ్యూనిటీ హాల్స్, ఫార్మేషన్ రోడ్ల నిర్మాణానికి 57 పనులకుగానూ రూ.2.87 కోట్లు, గోపాల్పేట మండలంలో 18 పనులకుగానూ రూ.96.50 లక్షలు, పెబ్బేరు మండలంలో 51 పనులకు రూ.2.87 కోట్లు, పెద్దమందడి మండలంలో 33 పనులకు రూ.2.50 కోట్లు, రేవల్లి మండలంలో 31 పనులకు రూ.1.54 కోట్లు, శ్రీరంగాపురం మండలంలో 53 పనులకు రూ.3.07 కోట్లు.. ఇ లా 270 పనులకు రూ.14.70 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హామీ మేరకు నిధులు కేటాయించడంతో ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.