‘ సాగుకు పెట్టుబడి సా యం, సాగునీరు, నిరం తర కరెంట్, పంటకు మ ద్దుతు ధర కల్పించి, ధా న్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిందే కేసీఆర్ సర్కారు.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. రైతులకు సాగు నీరు ఇచ్చి, వనపర్తి జిల్లాకు పేరు తెచ్చాను.. మరోమారు ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే పెద్ద జీతగాడిలా పని చేస్తాను.. ఆపద అని వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా చేతనైన సాయం చేశాను’.. అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నాగం తిరు పతిరెడ్డితో కలిసి గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే మంత్రి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
గోపాల్పేట, నవంబర్ 14 : రైతులకు సాగునీరు, నిరంతర కరెంట్, సాగుకు పెట్టుబడి, పండించిన పంటకు మద్దుతు ధర కల్పించి, ధాన్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిందే కేసీఆర్ సర్కారు అని వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని మున్ననూర్, జయన్నతిరుమలాపురం, ఏదుట్ల, చెన్నారం, గొల్ల పల్లి, చీర్కపల్లి, ఏదుల, అనంతాపురం, కొంకలపల్లి, గౌరిదేవిపల్లి, బండరా విపాకుల, శానాయిపల్లి, నాగపూర్, రేవల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. రైతులకు సాగు నీరు ఇచ్చానని, వనపర్తి జిల్లాకు పేరు తెచ్చానని, మరోమారు ఆశీర్వదించి ఆదరించి ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపితే పెద్ద జీతగాడిలా పని చేస్తామ న్నారు. కేసీఆర్ సర్కారు వల్ల లబ్ధిపొందని ఇల్లులేదన్నారు. దశల వారీగా గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 3లక్షలు అం దజేయనున్నట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచామని, సీ ఎం కేసీఆర్ అంకుంటిత దీక్షతో పని చేయడం వల్లే సాధ్యమైందన్నారు. ఉపాధి కరువై కడుపుచేత పట్టు కొని బతుకు దెరువు కోసం దూర ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితులు పో యాయని, కేసీఆర్ సర్కార్ వచ్చాక వలసలు ఆగిపోయాయని, సాగునీటి రాకతో ప్రతి చేతికి పని దొరకడంవల్ల రైతులు, రైతు కూలీలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ఆపద అని వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా చేతనైన సాయం చేశామన్నారు. నియోజకవర్గంలో 216 గ్రా మాలు, తండాల్లో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరు తీసుకొచ్చామన్నారు. రైతుల పొలాలకు వెళ్లే రహదారులను మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మిట్ట ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు 64 మినీ లిఫ్ట్లు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు అడిగిన పనులన్నీ చేసి మీ ఊర్లకు వచ్చాను నాపనితీరు చూసి గతంలో భారీ మోజార్టీ ఇచ్చారు. మీరిచ్చిన ప్రోత్సాహంతో అలుపెరుగకుండా ఐదేండ్ల్లు పని చేసి రాష్ట్ర స్థాయిలో వనపర్తికి మంచి పేరు తీసుకొచ్చామన్నారు. మరో సారి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి ..మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 11సార్లు రాష్ట్రం లో కాంగ్రెస్కు అధికారం ఇస్తే పాలమూరును ఎండబెట్టి పల్లెలను వల్లకాడు చేసిందన్నారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ వెనక్కుపోతుంది. రైతుబంధు ఆగిపోతుంది. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నట్లు అవుతుందన్నారు. రైతులకు పెద్ద జీతగాడిలా పనిచేస్తున్నా, వనపర్తికి మంచి పేరు తీసుకొచ్చానన్నా రు. 23ఏండ్ల కింద జెండా పట్టుకుని ఉద్యమం చేసి నం, స్వరాష్ట్రం సాధించినం, అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నా రు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మా ట్లాడుతూ అహర్నిశలు ప్రజా క్షేమం కోసం పరితపించే నాయకుడు, వనపర్తి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి నిరంజన్రెడ్డిని మరోమారు భారీ మె జార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడోసారి కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రావడం పక్కా అని ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, బోర్ల భీమయ్య, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, బంకల సేనాపతి, వైస్ ఎం పీపీ చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు నాగం తిరుపతిరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు రఘు యాదవ్, వైస్ చైర్మన్ గువ్వల రాములు, రైతు బంధు మండల అధ్యక్షులు తిరుపతియాదవ్, నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదం డం, రఘురామారావు, సర్పంచులు శేఖర్యాదవ్, శ్రీలత, రమేశ్, సునీల్, ఇందిర, నాగమణి, బాల్రెడ్డి, జగదీశ్, పార్వతమ్మ, లక్ష్మి, జ్యోతి, గౌతమి ఎంపీటీసీలు బాల్రెడ్డి, శ్రీశైలం, నరేందర్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.