కొల్లాపూర్రూరల్, డిసెంబర్ 4 : పట్టణంలోని వరిద్యాల ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో సోమవారం నుంచి బుధవారం వరకు శ్రీరామలింగేశ్వరస్వామి, పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, నవగ్రహాలు, వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. సోమవారం ఉదయం 9 గంటలకు గణపతి పూజ, సాయంతం 6 గంటలకు అగ్నిప్రతిష్ఠ జలాధివాసం అవాహిత దేవత పూజా మంత్ర పుష్పం, వేద స్వస్తి తీర్థప్రసాద వితరణ ఉంటుంది.
మంగళవారం ఉదయం 9 గంటలకు అవాహిత దేవతా పూ జలు హోమాలు, మధ్యాహ్నం 4 గంటలకు స్వామి వారి ఊరేగింపు, సా యంత్రం 6 గంటలకు అవాహిత దేవతాపూజలు దీక్షాహోమం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాది వాసం ఫలాదివా సం, హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అవాహిత దేవతా పూజలు మహోస్నాపనం, ఉదయం 11:35 గంటలకు శ్రీలక్ష్మీగణపతి, సుబ్రహ్మ ణ్య, స్వామి, పార్వతి రామలింగేశ్వర స్వామి, వీరభద్రుల విగ్రహంతోపాటు నందీశ్వర విగ్రహ యం త్ర ప్రతిష్ఠలు, విగ్రహస్థాపన, గర్తన్యాస శిలానన్యాసం ప్రాణప్రతిష్ట, శిఖర కలశ స్థాపన తదితర పూజలు, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉం టుందని ఆలయ కమిటీ పేర్కొన్నది. భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొని శ్రీశివరామాంజనేయ స్వామి కృపకు పాత్రు లు కావాలని కోరారు. అలాగే ఈనెల 10న మహా అఖండ భజన ఉంటుందని పేర్కొన్నారు.