కోయిలకొండ, మార్చి 30 : దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వింజమూర్ గ్రామానికి చెందిన రవికి దళితబంధు కింద మంజూరైన డెయిరీఫాం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలో మొట్టమొదటి సారిగా ఈ పథకం కో యిలకొండలో ప్రారంభించడం అభినందనీయమన్నా రు. మొదటి విడుతగా గార్లపాడ్, వింజమూర్ గ్రామాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. విడుతల వారీగా అన్ని గ్రామాలకు అమలు చేస్తామని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముం దు మల్కాపూర్లో రూ.8 లక్షలతో నిర్మిస్తున్న అటవీ శాఖ భవనానికి శంకుస్థాపన చేశారు. సురారంలో సైన్స్ల్యాబ్ను ప్రారంభించి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10 మందికి సీ ఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సంగనోనిపల్లి లో 75 శాతం రాయితీతో స్ప్రింక్లర్లను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో నవోదయ చైర్మన్ ఎస్.రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయ భాస్కర్రెడ్డి, ప్రత్యేకాధికారి మధుసూదన్గౌడ్, డీఎఫ్వో గంగిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచులు నారాయణ, నారాయణరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖాజా, నాయకులు శ్రీనివాస్రెడ్డి, మొగులయ్య, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.