వనపర్తి, నవంబర్ 15 : నూతన వైద్య కళాశాలల ఏ ర్పాటుతో ప్రజల చెంతకు వైద్యం వస్తుందని, ఒకేసారి ఎ నిమిది వైద్య కళాశాలల తరగతులు ప్రారంభించడం.. దే శ చరిత్రలోనే నూతన అధ్యయనానికి పునాది అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి వైద్య కళాశాల ప్రారంభోత్సవాన్ని మంగళవా రం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదా యం నుంచి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో హైదరాబాద్ వంటి వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పీహెచ్సీల బలోపేతంతోపాటు రాష్ట్రంలో 100 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.
పల్లె దవాఖానలతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తరువాత కూడా వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ దవాఖానలో కేసీఆర్ కిట్, అమ్మఒడితో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ కింద సురక్షిత తాగునీరు పంపిణీ చేయడం సీఎం కేసీఆర్ దూరదృష్టికి తార్కాణమన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జోగుళాంబగద్వాల జిల్లా చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్రెడ్డి, వనపర్తి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కమిటీ చైర్మన్ మెంటెపల్లి పురుషోత్తంరెడ్డి, రేవల్లి జెడ్పీటీసీ భీమయ్య మంత్రి నిరంజన్రెడ్డిని సన్మానించారు.