గద్వాల, ఫిబ్రవరి 26 : జోగుళాంబ గద్వాల రైల్వేస్టేషన్ అమృత్ భారత్ కింద ఎంపిక కావడం శుభపరిణామమని ఎంపీ రాములు అన్నారు. సో మవారం పీఎం మోదీ ఢిల్లీ నుంచి 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 ఆర్వోబీలు, అండర్పాస్ ప నులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్లో ఎంపీ రాములు, గ ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులు పాల్గొని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గ ద్వాల రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.9.49 కోట్లు మం జూరు చేసిన ప్రధానికి అభినందనలు తెలిపారు. ఈ రైల్వేస్టేషన్కు వంద ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించా రు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడు తూ దేశంలోని 554 స్టేషన్లలో గద్వాల ఒకటి కా వడం, ఈ స్టేషన్ను అభివృద్ధి చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
గద్వాల రైల్వే స్టేషన్ మీదు గా 20 కొత్త రైళ్లు నడుస్తున్నాయని, ప్రతి రైలు ఇ క్కడ ఆపేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 2013లో రాయిచూర్ రైల్వేలైన్ పూర్తి అయిందని, డోన్ వరకు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రైల్వేస్టేషన్కు గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ వంద ఎకరాల స్థలం ఇచ్చారని, దానిని సుందరంగా తీర్చిదిద్దాలని రైల్వే అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వికసిత భారత్, వికసిత రైల్వే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డివిజన్ రైల్వే అధికారి అరుణ్కుమార్శర్మ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం లో భాగంగా రైల్వే స్టేషన్లో ప్రధాన ద్వారంతోపా టు ప్రయాణ ప్రాంగణం, సమాచార సూచికలు, వెయిటింగ్ హాల్, ఎస్కలేటర్, వన్ స్టేషన్, వన్ప్రొడక్ట్, అప్గ్రేడ్ పార్కింగ్, దివ్యాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ కేశవ్, రైల్వేస్టేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.