మూసాపేట, జూన్ 20 : ఒక్కసారి ఆయిల్పాం మొక్క ల పెంపకంతో రైతులకు ఎక్కువ సంవత్సరాలు ఆదాయం వస్తూనే ఉంటుందని, పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మినరసింహయాదవ్, ఆయన సోదరుడి వ్యవసాయ పొలంలో ఆయిల్పాం తోట పెంపకంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
రైతులు వరికి బదులుగా ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు. పంటమార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీళ్లు 4ఎకరా ల ఆయిల్పాం సాగుకు పారుతుందన్నారు. ఆయిల్పాంకు ప్రకృతి విపత్తు, అడవి జంతువుల నుంచి కూడా ఎలాంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మినరసింహయాదవ్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, గూపని కొండ య్య, సాయిరెడ్డి, స్వరూప, వెంకటేశ్వర్రెడ్డి, మల్లయ్య, కలీం, రవి, వెంకటేశ్ పాల్గొన్నారు.