మక్తల్ టౌన్, డిసెంబర్ 4 : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడంతోపాటు సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కో సం, నేల జీవ శక్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉంది. నేటి పోటీ ప్రపంచంలో విపరీతమైన రసాయన ఎ రువులు, పురుగుల మందులు, ఇతర ఉత్పాదకాలు వినియోగంతో భూమి స్వభావం మారిపోతున్నది. పంటసాగు లో విత్తనాలు విత్తే క్రమంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్వ కాలంలో మన పూర్వికులు పశువుల పేడ నుంచి వచ్చే ఎరువును పంట పొలాల్లో వినియోగించడం వల్ల భూమి సాంద్రత పెరగడంతోపాటు అధిక ది గుబడులు రావడంతో రైతన్నలకు లాభాలు వచ్చేవి. పెరుగుతున్న యాంత్రికరణాలకు అనుగుణంగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు అలవాటు పడడంతో పూర్తిస్థాయిలో భూమిలోని సాంద్రత తగ్గిపోతూ ర సాయనిక ఎరువులు వేస్తేనే పంటలు పండే పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేతలు చెబుతున్నారు.
22 రకాల నేలలు
రాష్ట్రంలో 22 రకాల నేలలు ఉన్నాయి. నీటి నిల్వ సా మర్థ్యం, పోషకాల లభ్యత, నేల స్వభావం బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూములపై రైతులకు అవగాహన కల్పించేందుకు అనేక రకాలుగా వ్య వసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఏ విధంగా పంట సాగు చేయాలనే వివరాలను వెల్లడిస్తున్నారు. తె లంగాణ ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ, కర్బనం తక్కువగా ఉండడంతో దీనిని సరి చేయడానికి పచిరొట్ట్ట (జీలుగ, జానుం, పిల్లి పెసర) ఎరువులు వాడాలని సూచిస్తున్నారు. మన ప్రాంతం నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు ఎక్కువ శాతం ఉండడంతో వీటిని నియంత్రించేందుకు వేసవి కా లంలో భూమికి సాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల భూ మి కోతకు గురి కాకుండా ఉంటుంది. ప్రస్తుతం భూమిలో 60శాతం బోరు బావుల నుంచి నీళ్లు తోడడం వల్ల లవణా లు పైకి వచ్చి నేలపై పోరగా ఏర్పడడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. నేలపై మార్పులు చాలా నెమ్మదిగా ఏర్పడుతాయని భవిష్యత్తు తరాల యువ రైతులకు మంచి నేల స్వభావాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. రసాయన, క్రిమిసహకార మందులను నియంత్రించినప్పుడే భవిష్యత్తు తరాలకు మంచి నేల స్వభావాన్ని అందించగలుగుతామని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
భూసార పరీక్ష
ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల మంచి దిగుబడులు వస్తాయి. సమస్త జీవరాశికి ఆహా రం అందించేందుకు నీళ్లు చాలా అవసరం. పంటల్లో అధికదిగుబడులు సాధించడానికి భూమి సారవంతంగా ఉం డాలి. రైతులు భూసార పరీక్షలు చేయించడం వల్ల నేలలో సారం గా ఉన్న పోషకాలతోపాటు వేయబోయే పంటలకు ఎంతమేరా ఎరువులు వేసుకోవాలో అవగాహన కలుగుతు న్నది. భూసార పరీక్షల వల్ల నేల ఆమ్లా, బోడు గుణాలస్థాయి ని ర్ధారించి యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో నేల ఆరోగ్యంపై అవగా హన కల్పించేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. రాబోయే కాలంలో ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో మట్టి, నీటి పరీక్షలు జరిపి నే లల్లోని స్థూల, సూక్ష్మ పోషకాలస్థాయిని నిర్ధారించి యాజమాన్య పద్ధతులు చేపట్టడంతో రైతుల పెట్టుబడి తగ్గి ఆదా యం పెంచడానికి ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా వివరిస్తారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవడం మంచిది.